దుబాయ్ లో క్రిస్మస్ వేడుకలకు క్రైస్తవులు దూరం!
- December 21, 2023
దుబాయ్: దుబాయ్ లో క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. గాజాలోని పాలస్తీనియన్లకు మద్దతుగా వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పలువురు క్రైస్తవులు చెప్పారు. అయితే, చర్చీలకు వెళతామని, స్నేహితులతో క్రిస్మస్ వేడుకులను నిరాడంబరంగా జరుపుకోనున్నట్లు నివాసితులు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, క్రిస్మస్ వేడుకలను బెత్లెహెం రద్దు చేసింది.
“క్రైస్తవుల నిజమైన క్రిస్మస్ వేడుక చాలా ఆధ్యాత్మికంగా.. నిరాడంబరంగా ఉంటుంది. చర్చిలో మేము గాజా మరియు యుద్ధ ప్రాంతాలలో ఉన్న ప్రజలందరి కోసం ప్రార్థిస్తాము.’’ అని లెబనీస్ ప్రవాసులు సుజాన్ కజ్జీ అన్నారు. గాజాలో పరిస్థితి విషాదకరంగా ఉందని, అందుకే ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు మోల్డోవాకు చెందిన ఎవ్ఘేనీ పోగోనీ తెలిపారు. “యేసు పాలస్తీనాలోని బెత్లెహెమ్లో జన్మించాడు. క్రిస్మస్ శాంతి పండుగ. మేము పాలస్తీనా మరియు ఇజ్రాయెల్ రెండింటినీ వారి భూమిలో శాంతి పాలన కోసం ప్రార్థిస్తాం.’’ అని ప్రవాస భారతీయ జంట జెన్నిఫర్ మరియు క్లిఫోర్డ్ మెండోన్సా లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







