దుబాయ్ లో క్రిస్మస్ వేడుకలకు క్రైస్తవులు దూరం!
- December 21, 2023
దుబాయ్: దుబాయ్ లో క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. గాజాలోని పాలస్తీనియన్లకు మద్దతుగా వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పలువురు క్రైస్తవులు చెప్పారు. అయితే, చర్చీలకు వెళతామని, స్నేహితులతో క్రిస్మస్ వేడుకులను నిరాడంబరంగా జరుపుకోనున్నట్లు నివాసితులు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, క్రిస్మస్ వేడుకలను బెత్లెహెం రద్దు చేసింది.
“క్రైస్తవుల నిజమైన క్రిస్మస్ వేడుక చాలా ఆధ్యాత్మికంగా.. నిరాడంబరంగా ఉంటుంది. చర్చిలో మేము గాజా మరియు యుద్ధ ప్రాంతాలలో ఉన్న ప్రజలందరి కోసం ప్రార్థిస్తాము.’’ అని లెబనీస్ ప్రవాసులు సుజాన్ కజ్జీ అన్నారు. గాజాలో పరిస్థితి విషాదకరంగా ఉందని, అందుకే ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు మోల్డోవాకు చెందిన ఎవ్ఘేనీ పోగోనీ తెలిపారు. “యేసు పాలస్తీనాలోని బెత్లెహెమ్లో జన్మించాడు. క్రిస్మస్ శాంతి పండుగ. మేము పాలస్తీనా మరియు ఇజ్రాయెల్ రెండింటినీ వారి భూమిలో శాంతి పాలన కోసం ప్రార్థిస్తాం.’’ అని ప్రవాస భారతీయ జంట జెన్నిఫర్ మరియు క్లిఫోర్డ్ మెండోన్సా లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









