ఈ ఏడాది హైదరాబాద్లో 2 శాతం నేరాలు పెరిగాయి: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- December 22, 2023
హైదరాబాద్: హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను సీపీ శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. 2022తో పోలిస్తే ఈ ఏడాది 2 శాతం నేరాలు పెరిగాయని తెలిపారు. స్థిరాస్తి నేరాలు 3 శాతం పెరిగాయని చెప్పారు. మరోవైపు ఈ ఏడాదిలో మహిళలపై నేరాలు పెరిగాయని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలపై రేప్ కేసులు ఈ ఏడాది 403 నమోదయ్యాయని సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గతేడాది సైబర్ నేరాల్లో ఈ ఏడాది రూ.133 కోట్లు కాజేశారని.. 2022 లో 292 కేసులు నమోదు కాగా 2023 లో 344 కేసులు వచ్చాయని వివరించారు.
డ్రగ్స్ నిర్మూలనకు నార్కోటిక్ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తుందని హైదరాబాద్ సీపీ అన్నారు. సరఫరా చేసే వాళ్లు ఎక్కడ ఉన్నా వెతికిమరి పట్టుకుంటామని చెప్పారు. డ్రగ్స్ను గుర్తించేందుకు స్నిఫర్ డాగ్స్ను వినియోగిస్తామని వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకలు రాత్రి 1 లోపు ఆపివేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్బులు, బార్లలో డ్రగ్స్ ఉన్నాయని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!







