ఎమిరాటీ జంటను పరామర్శించిన ఆర్టీఏ అధికారులు
- December 26, 2023
దుబాయ్: డిసెంబర్ 21న జరిగిన ఘోరమైన ప్రేగ్ మాస్ షూటింగ్ లో గాయపడిన ఎమిరాటీ దంపతులను దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రతినిధి బృందం పరామర్శించింది. దంపతులిద్దరూ యూఏఈలో ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. భర్త అహ్మద్ ఇబ్రహీం ఒబైద్ అలీ అల్ అలీ ఉమ్ అల్ క్వైన్ మునిసిపాలిటీకి డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. భార్య రౌదా అల్ మెహ్రిజీ దుబాయ్లోని ఆర్టీఏలో మార్కెటింగ్ మరియు కార్పొరేట్ కమ్యూనికేషన్ డైరెక్టర్గా ఉన్నారు. ఈమేరకు వారిని కలిసిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దంపతుల ఆరోగ్యాన్ని, అలాగే వారి ఇద్దరు కుమార్తెలు మరియం మరియు లతీఫా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దంపతులు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. వారు సురక్షితంగా యూఏఈకి తిరిగి రావాలని ఆకాంక్షించారు. డిసెంబర్ 21న ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్లో ఆయుధాలు ధరించిన 24 ఏళ్ల విద్యార్థి జరిపిన కాల్పుల్లో 14 మంది మరణించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







