ఎమిరాటీ జంటను పరామర్శించిన ఆర్టీఏ అధికారులు
- December 26, 2023
దుబాయ్: డిసెంబర్ 21న జరిగిన ఘోరమైన ప్రేగ్ మాస్ షూటింగ్ లో గాయపడిన ఎమిరాటీ దంపతులను దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రతినిధి బృందం పరామర్శించింది. దంపతులిద్దరూ యూఏఈలో ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. భర్త అహ్మద్ ఇబ్రహీం ఒబైద్ అలీ అల్ అలీ ఉమ్ అల్ క్వైన్ మునిసిపాలిటీకి డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. భార్య రౌదా అల్ మెహ్రిజీ దుబాయ్లోని ఆర్టీఏలో మార్కెటింగ్ మరియు కార్పొరేట్ కమ్యూనికేషన్ డైరెక్టర్గా ఉన్నారు. ఈమేరకు వారిని కలిసిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దంపతుల ఆరోగ్యాన్ని, అలాగే వారి ఇద్దరు కుమార్తెలు మరియం మరియు లతీఫా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దంపతులు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. వారు సురక్షితంగా యూఏఈకి తిరిగి రావాలని ఆకాంక్షించారు. డిసెంబర్ 21న ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్లో ఆయుధాలు ధరించిన 24 ఏళ్ల విద్యార్థి జరిపిన కాల్పుల్లో 14 మంది మరణించారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







