మోదీ ఐదు దేశాల పర్యటన జూన్ 4న..
- May 29, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్వరలో విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. జూన్ 4 నుంచి అఫ్గానిస్థాన్, ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికో దేశాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు.. ఆయా దేశాధినేతలతో చర్చించనున్నారు.జూన్ 4న మోదీ అఫ్గాన్ బయలుదేరుతారు. అక్కడ రూ. 1400కోట్ల భారత నిధులతో నిర్మించిన సల్మా డ్యామ్ను మోదీ ప్రారంభిస్తారు. అనంతరం ఖతార్ వెళ్లి.. ఆ దేశాధిపతి షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-తనీతో ఆర్థిక సంబంధాలపై ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు.
ఖతార్ నుంచి మోదీ స్విట్జర్లాండ్ బయలుదేరుతారు. అక్కడ స్విస్ అధ్యక్షుడు జోహన్ షెనీదెర్ అమాన్తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా స్విస్ ఖాతాల్లో దాగిన భారత నల్లకుబేరులను బయటకు తీసుకొచ్చేందుకు ఇరువురు చర్చించనున్నారు. అక్కడి నుంచి జూన్ 7న మోదీ అమెరికా వెళ్తారు.అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు ఒబామాతో సమావేశంతో పాటు.. యూఎస్ కాంగ్రెస్లో మోదీ ప్రసంగించనున్నారు. తిరుగు ప్రయాణంలో ప్రధాని మోదీ మెక్సికోలో పర్యటిస్తారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







