సత్యరాజ్ పీరియాడికల్ హారర్ ఎంటర్టైనర్ `దొర`
- May 29, 2016
చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ లో, తండ్రి పాత్రల్లో సత్యరాజ్ తెలుగు ప్రేక్షకులకు చేరువైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తమిళంలో ఓ పీరియాడికల్ హారర్ ఎంటర్టైనర్లో నటించారు. `జాక్సన్ దురై` పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో `దొర` పేరుతో విడుదల చేస్తున్నారు. రత్నా సెల్యులాయిడ్స్ పతాకంపై జక్కం జవహర్బాబు ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ధరణీధరన్ దర్శకత్వం వహించారు. సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ హీరోగా నటించారు. బిందుమాధవి నాయిక. కరుణాకరన్, సహాయం రాజేంద్రన్ ఇతర కీలక పాత్రధారులు.
నిర్మాత జక్కం జవహర్బాబు మాట్లాడుతూ ``సత్యరాజ్గారికి తెలుగులో ఉన్న క్రేజ్ మనకు తెలిసిందే. ఆయన వైవిధ్యమైన పాత్రలో నటించిన చిత్రం ఈ `జాక్సన్ దురై`. తెలుగులో `దొర` పేరుతో అనువదిస్తున్నాం. తెలుగు, తమిళంలో ఏక కాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సిద్ధార్థ్ విపిన్ చాలా మంచి బాణీలను అందించారు. వెన్నెలకంటిగారు, చంద్రబోస్గారు చక్కటి సాహిత్యంతో పాటలు రాశారు. శశాంక్ వెన్నెలకంటి అద్భుతమైన డైలాగులు రాశారు. పీరియాడికల్ హారర్ ఎంటర్టైనర్ తరహా చిత్రమిది. అనువాద పనులు జరుగుతున్నాయి. జూన్ మొదటి వారంలో పాటలను, మూడో వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. తమిళంలో టీజర్కు ఇప్పటికే చాలా మంచి స్పందన వస్తోంది. ఇటీవలికాలంలో వైవిధ్యమైన హారర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఆ కోవలో `దొర` కూడా తప్పక తెలుగు వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఈ జోనర్ కొత్తగా ఉంటుంది`` అని చెప్పారు. ఈ సినిమాకు కెమెరా: యువరాజ్, సంగీతం: సిద్ధార్థ్ విపిన్, నేపథ్య సంగీతం: చిన్నా, పాటలు: వెన్నెలకంటి, చంద్రబోస్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, దర్శకత్వం: ధరణీధరన్, నిర్మాత: జక్కం జవహర్బాబు.






తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







