సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన అంబటి రాయుడు
- December 28, 2023
అమరావతి: మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన రాయుడు.. వైసీపీలో చేరారు. కండువా కప్పి అంబటి రాయుడిని పార్టీలోకి ఆహ్వానించారు జగన్. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ నుంచి గుంటూరు ఎంపీగా బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఇప్పటికే గుంటూరు పార్లమెంటు పరిధిలో రాయుడు విస్తృతంగా పర్యటిస్తున్నారు.
తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ తర్వాత అంబటి రాయుడు వైసీపీలో అధికారికంగా చేరారు. వాస్తవానికి చాలా కాలంగా వైసీపీకి అనుకూలంగా అంబటి రాయుడు వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు విస్తృతంగా పర్యటనలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా విద్యా రంగంలో సీఎం జగన్ తీసుకొచ్చిన మార్పులకు ఇంప్రెస్ అయ్యి తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు రాయుడు గతంలో ప్రకటించారు. నాడు-నేడు, స్పోర్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవడం, పేద పిల్లలను పైకి తీసుకొచ్చే విషయంలో సీఎం జగన్ అత్యంత కృషి చేస్తున్నారని, ఆ విధానాలు నచ్చి తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, జగన్ కు మద్దతుగా నిలుస్తానని గతంలో అంబటి రాయుడు చెప్పారు.
ఇప్పటికే రెండుసార్లు జగన్ ను కలిశారు రాయుడు. ఏపీలో స్పోర్ట్స్ కు సంబంధించి డెవలప్ మెంట్ ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని రాయుడు ఇదివరకే నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే గుంటూరు పార్లమెంటు పరిధిలో ప్రభుత్వ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాల్లో వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నారు.
అంతేకాదు జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. ఇక, గుంటూరు ఎంపీగా అంబటి రాయుడు పోటీ చేయనున్నట్లు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో గుంటూరు ఎంపీ స్థానాన్ని వైసీపీ కోల్పోయింది. అక్కడ టీడీపీ ఎంపీ గెలిచారు. 2024 ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా గుంటూరు ఎంపీ స్థానాన్ని తన ఖాతాలో వేసుకోవాలని వైసీపీ పట్టుదలగా ఉంది. ఇందులో భాగంగానే అంబటి రాయుడికి ఎంపీ టికెట్ ఇచ్చి కచ్చితంగా గెలిపించాలని పార్టీ నేతలకు సీఎం జగన్ చెప్పినట్లుగా సమాచారం.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







