కువైట్ లో ప్రయివేటు రంగ కార్మికులకు శుభవార్త
- December 29, 2023
కువైట్: ప్రైవేట్ రంగంలోని కార్మికులు అసలు యజమాని ఆమోదంతో మరొక యజమాని కోసం పార్ట్టైమ్ పని చేయడానికి అనుమతిస్తూ ఒక నిర్ణయాన్ని మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి, షేక్ తలాల్ అల్-ఖాలీద్ జారీ చేశారు. ఈ నిర్ణయం జనవరి 2024 నుండి అమలులోకి వస్తుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ నుండి పార్ట్టైమ్ వర్క్ పర్మిట్ పొందిన తర్వాత ప్రైవేట్ రంగ కార్మికులు రోజుకు గరిష్ఠంగా 4 గంటల పాటు మరొక యజమాని వద్ద పార్ట్టైమ్ పనిన చేసేందుకు అనుమతిస్తారు. రిక్రూట్మెంట్కు ప్రత్యామ్నాయంగా కువైట్లో ప్రస్తుతం ఉన్న శ్రామికశక్తి నుండి ప్రయోజనం పొందాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ తెలిపింది.
దీనితో పాటు ప్రైవేట్ రంగంలో రిమోట్ వర్క్ను అనుమతించాలని, ప్రక్రియను నిర్వహించడానికి నిబంధనలను సిద్ధం చేయాలని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ ను మంత్రి ఆదేశించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







