కువైట్ లో ప్రయివేటు రంగ కార్మికులకు శుభవార్త
- December 29, 2023
కువైట్: ప్రైవేట్ రంగంలోని కార్మికులు అసలు యజమాని ఆమోదంతో మరొక యజమాని కోసం పార్ట్టైమ్ పని చేయడానికి అనుమతిస్తూ ఒక నిర్ణయాన్ని మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి, షేక్ తలాల్ అల్-ఖాలీద్ జారీ చేశారు. ఈ నిర్ణయం జనవరి 2024 నుండి అమలులోకి వస్తుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ నుండి పార్ట్టైమ్ వర్క్ పర్మిట్ పొందిన తర్వాత ప్రైవేట్ రంగ కార్మికులు రోజుకు గరిష్ఠంగా 4 గంటల పాటు మరొక యజమాని వద్ద పార్ట్టైమ్ పనిన చేసేందుకు అనుమతిస్తారు. రిక్రూట్మెంట్కు ప్రత్యామ్నాయంగా కువైట్లో ప్రస్తుతం ఉన్న శ్రామికశక్తి నుండి ప్రయోజనం పొందాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ తెలిపింది.
దీనితో పాటు ప్రైవేట్ రంగంలో రిమోట్ వర్క్ను అనుమతించాలని, ప్రక్రియను నిర్వహించడానికి నిబంధనలను సిద్ధం చేయాలని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ ను మంత్రి ఆదేశించారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







