‘యాత్ర 2’ స్కెచ్ అదేనా.?
- January 05, 2024
రాజశేఖర్ రెడ్డి బయోపిక్గా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా గతంలో ఓ మోస్తరు విజయం అందుకుంది. విజయం సంగతెలా వున్నా.. ఈ సినిమా గురించీ, ఆ డైరెక్టర్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు.
ఆయన మరెవరో కాదు.. మహి. వి. రాఘవ. రాజశేఖర్ రెడ్డి పాద యాత్ర నేపథ్యాన్ని కథా వస్తువుగా తీసుకుని ఈ సినిమాని తెరకెక్కించారాయన. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించారు.
కాగా, ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ వస్తోంది. అదే ‘యాత్ర 2’. ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్గా రిలీజ్ చేసిన పోస్టర్లో తండ్రితో పాటూ తనయుడు జగన్ మోహన్ రెడ్డి కూడా కనిపిస్తున్నాడు. ఠీవీగా రాజశేఖర్ రెడ్డి కుర్చీలో కూర్చుంటే, ఆయన పక్కనే తనయుడు జగన్ మోహన్ రెడ్డి నిలుచుని కనిపిస్తున్నాడు.
త్వరలోనే ఎలక్షన్స్ వున్న నేపథ్యంలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొన్న ఇదే కాన్సెప్ట్తో ప్రస్తుత రాజకీయాల కథా వస్తువుగా తెరకెక్కిన ‘వ్యూహం’ సినిమా రిలీజ్ బెడిసి కొట్టింది. ‘యాత్ర 2’ను ఎలాగైనా ఎలక్షన్స్ దగ్గర చేసి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరి, ఈ వ్యూహమైనా ఫలిస్తుందో లేదో చూడాలిక.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







