‘యాత్ర 2’ స్కెచ్ అదేనా.?
- January 05, 2024
రాజశేఖర్ రెడ్డి బయోపిక్గా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా గతంలో ఓ మోస్తరు విజయం అందుకుంది. విజయం సంగతెలా వున్నా.. ఈ సినిమా గురించీ, ఆ డైరెక్టర్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు.
ఆయన మరెవరో కాదు.. మహి. వి. రాఘవ. రాజశేఖర్ రెడ్డి పాద యాత్ర నేపథ్యాన్ని కథా వస్తువుగా తీసుకుని ఈ సినిమాని తెరకెక్కించారాయన. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించారు.
కాగా, ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ వస్తోంది. అదే ‘యాత్ర 2’. ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్గా రిలీజ్ చేసిన పోస్టర్లో తండ్రితో పాటూ తనయుడు జగన్ మోహన్ రెడ్డి కూడా కనిపిస్తున్నాడు. ఠీవీగా రాజశేఖర్ రెడ్డి కుర్చీలో కూర్చుంటే, ఆయన పక్కనే తనయుడు జగన్ మోహన్ రెడ్డి నిలుచుని కనిపిస్తున్నాడు.
త్వరలోనే ఎలక్షన్స్ వున్న నేపథ్యంలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొన్న ఇదే కాన్సెప్ట్తో ప్రస్తుత రాజకీయాల కథా వస్తువుగా తెరకెక్కిన ‘వ్యూహం’ సినిమా రిలీజ్ బెడిసి కొట్టింది. ‘యాత్ర 2’ను ఎలాగైనా ఎలక్షన్స్ దగ్గర చేసి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరి, ఈ వ్యూహమైనా ఫలిస్తుందో లేదో చూడాలిక.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









