140 భాషల్లో పాటపాడి గిన్నిస్ రికార్డు సాధించిన సుచేతా సతీశ్
- January 08, 2024
దుబాయ్: దుబాయ్ లో నివసిస్తున్న కేరళకు చెందిన సుచేతా సతీశ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. దుబాయ్లో గత ఏడాది నవంబర్ 24న జరిగిన కాప్-28 వాతావరణ సదస్సు వేదికగా 140 భాషల్లో పాటలు పాడారు.
ఆమె అద్భుత ప్రదర్శనకు అక్కడున్న వారంతా ఫిదా అయ్యారు. ఆమె సంగీత నైపుణ్యం శ్రోతలను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ఆమెకు అవార్డును బహూకరించారు. తాజాగా ఆ విషయాన్ని సుచేతా సతీశ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.
కాంప్-28కి హాజరైన 140 దేశాలకు ప్రతీకగా 140 భాషల్లో పాడినట్లు ఆమె వివరించారు. '' దేవుడి దయతోనే ఈ రికార్డు సాధించాను. 9 గంటల్లో 140 భాషల్లో పాడటం చాలా అదృష్టంగా భావిస్తున్నా. నా వెన్నంటి నిలుస్తూ మద్దతిచ్చిన వారందరికీ ధన్యవాదాలు'' అని సుచేతా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!









