కీలక నిర్ణయం తీసుకున్న 'హనుమాన్' టీమ్
- January 07, 2024
హైదరాబాద్: 'హనుమాన్' టీమ్ ఓ కీలకమైన నిర్ణయాన్ని తీసుకొంది. ఈ సినిమా కోసం తెగే ప్రతీ టికెట్ నుంచి వచ్చే ఆదాయంలో రూ.5 అయోధ్య రామమందిరం కోసం విరాళంగా ప్రకటించింది.
ఈరోజు హైదరాబాద్ లో 'హనుమాన్' ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన ద్వారా… హనుమాన్ టీమ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అయోధ్యలో రామమందిరం ప్రారంభిస్తున్న ఈ తరుణంలోనే `హనుమాన్` వస్తోంది. అందుకే.. 'హనుమాన్' టీమ్ ఈ నిర్ణయం తీసుకొంది.
"అయోధ్యలో నిర్మించిన రామమందిరం చరిత్రలో నిలిచిపోయే అపురూపమైన ఘట్టం. ఈ విశిష్ట పుణ్య కార్యానికి ఎవరు ఏ రూపంలో అయినా సహాయం అందించొచ్చు. 'హనుమాన్' టీమ్ తీసుకొన్న ఈ నిర్ణయం చాలా గొప్పది. ఆపుణ్యం ఈ టీమ్ కి దక్కుతుంది. ఓ వరం అవుతుంది" అని చిరంజీవి ప్రశంసించారు. తేజా సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఈనెల 12న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. 11 నుంచే ప్రీమియర్ షోల హడావుడి మొదలు కానుంది.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









