కీలక నిర్ణయం తీసుకున్న 'హనుమాన్' టీమ్
- January 07, 2024
హైదరాబాద్: 'హనుమాన్' టీమ్ ఓ కీలకమైన నిర్ణయాన్ని తీసుకొంది. ఈ సినిమా కోసం తెగే ప్రతీ టికెట్ నుంచి వచ్చే ఆదాయంలో రూ.5 అయోధ్య రామమందిరం కోసం విరాళంగా ప్రకటించింది.
ఈరోజు హైదరాబాద్ లో 'హనుమాన్' ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన ద్వారా… హనుమాన్ టీమ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అయోధ్యలో రామమందిరం ప్రారంభిస్తున్న ఈ తరుణంలోనే `హనుమాన్` వస్తోంది. అందుకే.. 'హనుమాన్' టీమ్ ఈ నిర్ణయం తీసుకొంది.
"అయోధ్యలో నిర్మించిన రామమందిరం చరిత్రలో నిలిచిపోయే అపురూపమైన ఘట్టం. ఈ విశిష్ట పుణ్య కార్యానికి ఎవరు ఏ రూపంలో అయినా సహాయం అందించొచ్చు. 'హనుమాన్' టీమ్ తీసుకొన్న ఈ నిర్ణయం చాలా గొప్పది. ఆపుణ్యం ఈ టీమ్ కి దక్కుతుంది. ఓ వరం అవుతుంది" అని చిరంజీవి ప్రశంసించారు. తేజా సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఈనెల 12న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. 11 నుంచే ప్రీమియర్ షోల హడావుడి మొదలు కానుంది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







