కీలక నిర్ణయం తీసుకున్న 'హనుమాన్' టీమ్
- January 07, 2024
హైదరాబాద్: 'హనుమాన్' టీమ్ ఓ కీలకమైన నిర్ణయాన్ని తీసుకొంది. ఈ సినిమా కోసం తెగే ప్రతీ టికెట్ నుంచి వచ్చే ఆదాయంలో రూ.5 అయోధ్య రామమందిరం కోసం విరాళంగా ప్రకటించింది.
ఈరోజు హైదరాబాద్ లో 'హనుమాన్' ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన ద్వారా… హనుమాన్ టీమ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అయోధ్యలో రామమందిరం ప్రారంభిస్తున్న ఈ తరుణంలోనే `హనుమాన్` వస్తోంది. అందుకే.. 'హనుమాన్' టీమ్ ఈ నిర్ణయం తీసుకొంది.
"అయోధ్యలో నిర్మించిన రామమందిరం చరిత్రలో నిలిచిపోయే అపురూపమైన ఘట్టం. ఈ విశిష్ట పుణ్య కార్యానికి ఎవరు ఏ రూపంలో అయినా సహాయం అందించొచ్చు. 'హనుమాన్' టీమ్ తీసుకొన్న ఈ నిర్ణయం చాలా గొప్పది. ఆపుణ్యం ఈ టీమ్ కి దక్కుతుంది. ఓ వరం అవుతుంది" అని చిరంజీవి ప్రశంసించారు. తేజా సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఈనెల 12న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. 11 నుంచే ప్రీమియర్ షోల హడావుడి మొదలు కానుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..