కీలక నిర్ణయం తీసుకున్న 'హనుమాన్' టీమ్
- January 07, 2024
హైదరాబాద్: 'హనుమాన్' టీమ్ ఓ కీలకమైన నిర్ణయాన్ని తీసుకొంది. ఈ సినిమా కోసం తెగే ప్రతీ టికెట్ నుంచి వచ్చే ఆదాయంలో రూ.5 అయోధ్య రామమందిరం కోసం విరాళంగా ప్రకటించింది.
ఈరోజు హైదరాబాద్ లో 'హనుమాన్' ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన ద్వారా… హనుమాన్ టీమ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అయోధ్యలో రామమందిరం ప్రారంభిస్తున్న ఈ తరుణంలోనే `హనుమాన్` వస్తోంది. అందుకే.. 'హనుమాన్' టీమ్ ఈ నిర్ణయం తీసుకొంది.
"అయోధ్యలో నిర్మించిన రామమందిరం చరిత్రలో నిలిచిపోయే అపురూపమైన ఘట్టం. ఈ విశిష్ట పుణ్య కార్యానికి ఎవరు ఏ రూపంలో అయినా సహాయం అందించొచ్చు. 'హనుమాన్' టీమ్ తీసుకొన్న ఈ నిర్ణయం చాలా గొప్పది. ఆపుణ్యం ఈ టీమ్ కి దక్కుతుంది. ఓ వరం అవుతుంది" అని చిరంజీవి ప్రశంసించారు. తేజా సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఈనెల 12న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. 11 నుంచే ప్రీమియర్ షోల హడావుడి మొదలు కానుంది.
తాజా వార్తలు
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!
- దుబాయ్లోని 2 కమ్యూనిటీలలో పెయిడ్ పార్కింగ్..డైలీ రోటిన్స్ ఎఫెక్ట్..!!
- ఒమన్ లో ఎయిర్ లిఫ్ట్..పలు వాహనాలు సీజ్..!!
- గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!







