కంటెంట్ సృష్టికర్తలకు మద్దతు.. Dhs150 మిలియన్ల నిధిని ప్రకటించిన షేక్ మహమ్మద్
- January 11, 2024
యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా కంటెంట్ సృష్టికర్తలకు మద్దతు ఇవ్వడానికి 150 మిలియన్ల నిధులను, శాశ్వత ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తన ఎక్స్ అకౌంట్లో ప్రకటించారు. I బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్ నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. ఇది దుబాయ్లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద కంటెంట్ సృష్టికర్తల సమ్మేళనంగా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా షేక్ మహమ్మద్ మాట్లాడుతూ.. యూఏఈ నేడు 3,000 మంది కంటెంట్ సృష్టికర్తలకు హోస్ట్గా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 95 దేశాల నుండి 1.8 బిలియన్లకు పైగా అనుచరులతో కంటెంట్ సృష్టికర్తల అతిపెద్ద ప్రపంచ సమావేశాలలో ఇది ఒకటన్నారు. ‘‘కంటెంట్ సృష్టి బాధ్యత, మీడియా భవిష్యత్తు అని వారికి తెలియజేస్తున్నాము. మేము కంటెంట్ సృష్టికర్తలకు మద్దతు ఇవ్వడానికి.. వారి నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి వారిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి వారి కోసం శాశ్వత ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి Dhs150 మిలియన్ల నిధిని ప్రకటించాము" అని షేక్ మహ్మద్ తెలిపారు.
తాజా వార్తలు
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక







