కంటెంట్ సృష్టికర్తలకు మద్దతు.. Dhs150 మిలియన్ల నిధిని ప్రకటించిన షేక్ మహమ్మద్
- January 11, 2024
యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా కంటెంట్ సృష్టికర్తలకు మద్దతు ఇవ్వడానికి 150 మిలియన్ల నిధులను, శాశ్వత ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తన ఎక్స్ అకౌంట్లో ప్రకటించారు. I బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్ నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. ఇది దుబాయ్లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద కంటెంట్ సృష్టికర్తల సమ్మేళనంగా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా షేక్ మహమ్మద్ మాట్లాడుతూ.. యూఏఈ నేడు 3,000 మంది కంటెంట్ సృష్టికర్తలకు హోస్ట్గా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 95 దేశాల నుండి 1.8 బిలియన్లకు పైగా అనుచరులతో కంటెంట్ సృష్టికర్తల అతిపెద్ద ప్రపంచ సమావేశాలలో ఇది ఒకటన్నారు. ‘‘కంటెంట్ సృష్టి బాధ్యత, మీడియా భవిష్యత్తు అని వారికి తెలియజేస్తున్నాము. మేము కంటెంట్ సృష్టికర్తలకు మద్దతు ఇవ్వడానికి.. వారి నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి వారిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి వారి కోసం శాశ్వత ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి Dhs150 మిలియన్ల నిధిని ప్రకటించాము" అని షేక్ మహ్మద్ తెలిపారు.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









