కంటెంట్ సృష్టికర్తలకు మద్దతు.. Dhs150 మిలియన్ల నిధిని ప్రకటించిన షేక్ మహమ్మద్
- January 11, 2024
యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా కంటెంట్ సృష్టికర్తలకు మద్దతు ఇవ్వడానికి 150 మిలియన్ల నిధులను, శాశ్వత ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తన ఎక్స్ అకౌంట్లో ప్రకటించారు. I బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్ నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. ఇది దుబాయ్లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద కంటెంట్ సృష్టికర్తల సమ్మేళనంగా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా షేక్ మహమ్మద్ మాట్లాడుతూ.. యూఏఈ నేడు 3,000 మంది కంటెంట్ సృష్టికర్తలకు హోస్ట్గా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 95 దేశాల నుండి 1.8 బిలియన్లకు పైగా అనుచరులతో కంటెంట్ సృష్టికర్తల అతిపెద్ద ప్రపంచ సమావేశాలలో ఇది ఒకటన్నారు. ‘‘కంటెంట్ సృష్టి బాధ్యత, మీడియా భవిష్యత్తు అని వారికి తెలియజేస్తున్నాము. మేము కంటెంట్ సృష్టికర్తలకు మద్దతు ఇవ్వడానికి.. వారి నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి వారిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి వారి కోసం శాశ్వత ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి Dhs150 మిలియన్ల నిధిని ప్రకటించాము" అని షేక్ మహ్మద్ తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







