యూఏఈలో ప్రీ-బోర్డ్ పరీక్షలు ప్రారంభం
- January 12, 2024
యూఏఈ: యూఏఈలోని CBSE అనుబంధ పాఠశాలల్లో విద్యార్థులు ప్రస్తుతం తమ ప్రీ-బోర్డ్ లేదా మాక్ పరీక్షలు రాస్తున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10 మరియు 12 తరగతులకు ఫిబ్రవరి 15న ప్రారంభం కానున్న బోర్డు పరీక్షల కంటే ముందు ఇవి నిర్వహించబడుతున్నాయి. పరీక్షలు ఏప్రిల్ 2 న ముగుస్తాయి. అన్ని పరీక్షలు యూఏఈ సమయం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని అబుదాబిలోని GEMS యునైటెడ్ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్/సీఈఓ K జార్జ్ మాథ్యూ తెలిపారు. జనవరి మూడవ వారంలో బోర్డు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని చెప్పారు. బోర్డు ప్రాక్టికల్ పరీక్షల కోసం ఇతర పాఠశాలల్లో పనిచేసే ప్రధానోపాధ్యాయులను నియమించిందని GEMS అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్ లలిత సురేష్ వెల్లడించారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









