121 వాహనాలు స్వాధీనం..500 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు
- January 13, 2024
యూఏఈ: దుబాయ్ పోలీసులు ఇటీవల అల్ ఖవానీజ్ ప్రాంతంలో 121 వాహనాలను స్వాధీనం చేసుకున్నారని, వారిపై 500 ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేసినట్టు అధికారులు శుక్రవారం తెలిపారు. అల్ ఖవానీజ్ నివాసితులు మరియు లాస్ట్ ఎగ్జిట్ వద్ద సందర్శకుల నుండి అనేక ఫిర్యాదులు తమకు అందాయని దుబాయ్ పోలీస్లోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి చెప్పారు. ఈ నేపథ్యంలో చేపట్టిన తనిఖీలలో రాష్ డ్రైవింగ్, స్టంట్ డ్రైవింగ్కు పాల్పడ్డ 81 కార్లు, 40 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గత ఏడాది జూలైలో అమలు చేసిన కొత్త దుబాయ్ ట్రాఫిక్ చట్టం ప్రకారం.. ప్రాణాలకు, ఆస్తికి మరియు ప్రజల భద్రతకు హాని కలిగించే నిర్లక్ష్యపు డ్రైవింగ్ నేరమని, ఆయా నేరాలకు పాల్పడితే వాహనాల జప్తుతోపాటు 50,000 దిర్హామ్ జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. స్మార్ట్ఫోన్లలోని దుబాయ్ పోలీస్ యాప్లోని 'పోలీస్ ఐ' సేవ ద్వారా లేదా 901లో 'వి ఆర్ ఆల్ పోలీస్' సేవ ద్వారా ఏదైనా రహదారి భద్రత ఉల్లంఘనలను నివేదించాలని దుబాయ్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..