గవర్నర్ తమిళిసైకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అనూప్ చక్రవర్తి

- January 13, 2024 , by Maagulf
గవర్నర్ తమిళిసైకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అనూప్ చక్రవర్తి

హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ కు శ్రీమాన్ గ్రూప్స్ సంస్థ అధినేత అనూప్ చక్రవర్తి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. టీటీడీ క్యాలెండర్, వెంకేటేశ్వర స్వామి ఫోటో జ్ఞాపికను గవర్నర్ కు అందజేశారు.శనివారం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా టీటీడీ ఎల్ఏసీ మెంబర్ గా ఎన్నికైన సందర్భంగా అనూప్ చక్రవర్తిని గవర్నర్ సన్మానించారు. అలాగే శ్రీమాన్ ఫౌండేషన్ ద్వారా అనూప్ చక్రవర్తి చేస్తున్న సేవలను తెలుసుకొని అభినందించారు. అనంతరం గవర్నర్ చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా  ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు శ్రీమాన్ ఫౌండేషన్ ద్వారా స్కూల్ కిట్ పెన్సిల్, నోట్ బుక్స్, ప్యాడ్స్, పెన్స్ లను ఆయన అందజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com