కాశ్మీర్ టెక్స్టైల్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం
- January 16, 2024
కువైట్: ఐదు రోజుల పాటు కాశ్మీర్ టెక్స్టైల్స్ ఎగ్జిబిషన్ కువైట్లోని సధు హౌస్లో ప్రారంభమైంది. ఇందులో కాశ్మీర్ కు సంబంధించిన సున్నితమైన వస్త్రాలు, వారసత్వ కనీ నేత వస్త్రాలు, సోజ్నీ ఎంబ్రాయిడరీ పాష్మినా శాలువాల స్టాల్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కాశ్మీర్ లూమ్ కంపెనీ ఇండియా సహకారంతో సదు హౌస్ కువైట్ ఈ ప్రదర్శనను నిర్వహిస్తోంది. ఈ ఎగ్జిబిషన్ను కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా ఆదివారం ప్రారంభించారు. ఎగ్జిబిషన్లో కాశ్మీర్ లూమ్ పాతకాలపు-శైలి కోటులు హ్యాండ్ ఎంబ్రాయిడరీ, ఇకత్-డైడ్ పాష్మినాతో పాటు పేపర్ మాచే సాంప్రదాయ క్రాఫ్ట్లో చేతితో ఎంబ్రాయిడరీ చేసిన కుషన్లు, ఇంటి వస్తువుల క్యూరేటెడ్ కలెక్షన్స్ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. జనవరి 18వ తేదీ వరకు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మరియు సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ ను సందర్శించవచ్చు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









