కాశ్మీర్ టెక్స్టైల్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం
- January 16, 2024
కువైట్: ఐదు రోజుల పాటు కాశ్మీర్ టెక్స్టైల్స్ ఎగ్జిబిషన్ కువైట్లోని సధు హౌస్లో ప్రారంభమైంది. ఇందులో కాశ్మీర్ కు సంబంధించిన సున్నితమైన వస్త్రాలు, వారసత్వ కనీ నేత వస్త్రాలు, సోజ్నీ ఎంబ్రాయిడరీ పాష్మినా శాలువాల స్టాల్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కాశ్మీర్ లూమ్ కంపెనీ ఇండియా సహకారంతో సదు హౌస్ కువైట్ ఈ ప్రదర్శనను నిర్వహిస్తోంది. ఈ ఎగ్జిబిషన్ను కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా ఆదివారం ప్రారంభించారు. ఎగ్జిబిషన్లో కాశ్మీర్ లూమ్ పాతకాలపు-శైలి కోటులు హ్యాండ్ ఎంబ్రాయిడరీ, ఇకత్-డైడ్ పాష్మినాతో పాటు పేపర్ మాచే సాంప్రదాయ క్రాఫ్ట్లో చేతితో ఎంబ్రాయిడరీ చేసిన కుషన్లు, ఇంటి వస్తువుల క్యూరేటెడ్ కలెక్షన్స్ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. జనవరి 18వ తేదీ వరకు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మరియు సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ ను సందర్శించవచ్చు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







