ఆక్యుపేషనల్ స్క్రీనింగ్ సెంటర్ ప్రారంభం
- May 30, 2016
యూఏఈలో తొలి ఆక్యుపేషనల్ స్క్రీనింగ్ సెంటర్ని ప్రారంభించారు. అప్టౌన్ హెల్త్ స్క్రీనింగ్ పేరుతో ఇది ప్రారంభించబడింది. హెల్త్ అథారిటీ (డిహెచ్ఎ) చైర్మన్ ఆఫ్ ది బోర్డ్ మరియు డైరెక్టర్ జనరల్ హమిద్ అల్ ఖతామి, అప్టౌన్ మిర్దిఫ్లో ఈ స్క్రీనింగ్ సెంటర్ని ప్రారంభించారు. 15 జాబ్ కేటగిరీస్లోని వారికి ఆక్యుపేషనల్ స్క్రీనింగ్ ఈ సెంటర్లో నిర్వహిస్తారు. ఆయా ప్రొఫెషన్ అవసరాలకు తగ్గట్టుగా సర్టిఫికేషన్ కోసం ఈ స్క్రీనింగ్ సెంటర్ని సంప్రదించవలసి ఉంటుంది. ఫిజికల్ టెస్ట్లు, ఎక్స్రే వంటి సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఎక్స్రే రూమ్స్, బ్లడ్ కలెక్షన్ రూమ్స్, బ్లడ్ ప్రాసెసింగ్ ల్యాబ్, ఆరు కన్సల్టేషన్ రూమ్స్ ఈ సెంటర్లో ఏర్పాటు చేశారు. 4 నుంచి 5 పరీక్షలు 300 దిర్హామ్ల నుంచి 900 దిర్హామ్లదాకా ఖర్చుతో ఇక్కడ లభ్యమవుతాయి.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







