కార్మిక హక్కులకు కట్టుబడి ఉన్నాం: మినిస్టర్
- May 30, 2016
కార్మికుల హక్కుల్ని పరిరక్షించేందుకు యూఏఈ కట్టుబడి ఉందని యూఏఈ మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ సక్ర్ బిన్ ఘోబాష్ సయీద్ ఘోబాష్ చెప్పారు. కార్మికుల హక్కుల్ని పరిరక్షించడంతోపాటుగా, వారికి చట్టాల పట్ల ఒప్పందాల పట్ల అవగాహన కల్పించడం అలాగే, కాంట్రాక్ట్ సంస్థలకూ కార్మికుల హక్కులపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను మినిస్ట్రీ చేపడుతోందని ఆయన వివరించారు. జూన్ 10 వరకు జెనీవాలో జరిగే 105వ ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ నేపథ్యంలో మినిస్టర్, దేశంలో కార్మిక వ్యవస్థ బలోపేతంగా ఉందనీ, కార్మికులు స్వేచ్ఛగా సౌకర్యంగా పనిచేసుకునే అవకాశం దేశంలో కల్పిస్తున్నామని వివరించారు. ఐఎల్ఓ కాన్ఫరెన్స్లో యూఏఈ డెలిగేషన్ పలు విషయాలపై చర్చించనుంది. పబ్లిక్ సెక్టార్, ఎంప్లాయర్స్ మరియు వర్కర్స్ ప్రతినిథులు ఈ డెలిగేషన్లో భాగం పంచుకుంటున్నారు. 187 సభ్య దేశాల నుంచి ప్రతినిథులు ప్రపంచంలోని వివిధ దేశాల్లో పరిస్థితుల్ని, అలాగే గ్లోబల్ చైన్స్ సహా పలు అంశాలపై చర్చిస్తారు.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









