కార్మిక హక్కులకు కట్టుబడి ఉన్నాం: మినిస్టర్
- May 30, 2016
కార్మికుల హక్కుల్ని పరిరక్షించేందుకు యూఏఈ కట్టుబడి ఉందని యూఏఈ మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ సక్ర్ బిన్ ఘోబాష్ సయీద్ ఘోబాష్ చెప్పారు. కార్మికుల హక్కుల్ని పరిరక్షించడంతోపాటుగా, వారికి చట్టాల పట్ల ఒప్పందాల పట్ల అవగాహన కల్పించడం అలాగే, కాంట్రాక్ట్ సంస్థలకూ కార్మికుల హక్కులపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను మినిస్ట్రీ చేపడుతోందని ఆయన వివరించారు. జూన్ 10 వరకు జెనీవాలో జరిగే 105వ ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ నేపథ్యంలో మినిస్టర్, దేశంలో కార్మిక వ్యవస్థ బలోపేతంగా ఉందనీ, కార్మికులు స్వేచ్ఛగా సౌకర్యంగా పనిచేసుకునే అవకాశం దేశంలో కల్పిస్తున్నామని వివరించారు. ఐఎల్ఓ కాన్ఫరెన్స్లో యూఏఈ డెలిగేషన్ పలు విషయాలపై చర్చించనుంది. పబ్లిక్ సెక్టార్, ఎంప్లాయర్స్ మరియు వర్కర్స్ ప్రతినిథులు ఈ డెలిగేషన్లో భాగం పంచుకుంటున్నారు. 187 సభ్య దేశాల నుంచి ప్రతినిథులు ప్రపంచంలోని వివిధ దేశాల్లో పరిస్థితుల్ని, అలాగే గ్లోబల్ చైన్స్ సహా పలు అంశాలపై చర్చిస్తారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







