తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త..
- January 23, 2024
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ఒకటి. ఈ పథకాన్ని ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ పథకానికి సంబంధించి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెల (ఫిబ్రవరి) నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
మంగళవారం గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్నింటిని వంద రోజుల్లో తప్పక నెరవేర్చుతామని మరోమారు స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు హామీలను నెరవేర్చిన విషయాన్ని గుర్తు చేశారు. హామీలపై వెనక్కి తగ్గమని, ఇందులో ఎలాంటి సందేహలు అక్కరలేదన్నారు.
గత ప్రభుత్వం వైఖరి కారణంగా రాష్ట్రం అప్పుల పాలైందని, ఈ కారణంగానే హామీల అమలులో జాప్యం జరుగుతోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలవలేదన్నారు. గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పని చేసిన జగదీశ్ రెడ్డి జైలుకి పోవడం ఖాయమన్నారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన అక్రమాలపై విచారణ ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







