తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త..
- January 23, 2024
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ఒకటి. ఈ పథకాన్ని ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ పథకానికి సంబంధించి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెల (ఫిబ్రవరి) నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
మంగళవారం గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్నింటిని వంద రోజుల్లో తప్పక నెరవేర్చుతామని మరోమారు స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు హామీలను నెరవేర్చిన విషయాన్ని గుర్తు చేశారు. హామీలపై వెనక్కి తగ్గమని, ఇందులో ఎలాంటి సందేహలు అక్కరలేదన్నారు.
గత ప్రభుత్వం వైఖరి కారణంగా రాష్ట్రం అప్పుల పాలైందని, ఈ కారణంగానే హామీల అమలులో జాప్యం జరుగుతోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలవలేదన్నారు. గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పని చేసిన జగదీశ్ రెడ్డి జైలుకి పోవడం ఖాయమన్నారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన అక్రమాలపై విచారణ ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!







