విశ్వ హిందీ పరిషత్తు సమన్వయకర్తగా అచార్య యార్లగడ్డ
- January 23, 2024
విశాఖపట్నం: పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. హిందీ భాషాభివృద్ది కోసం ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న విశ్వ హిందీ పరిషత్, అచార్య యార్లగడ్డను అమెరికా, కెనాడా దేశాలకు హిందీ భాషా సమన్వయకర్తగా నియమించింది. అక్కడి ఔత్సాహికులకు యార్లగడ్డ హిందీ నేర్చుకోవటంలో ప్రత్యేక తర్ఫీదును ఇస్తారు. నెలరోజుల తరువాత కెనడా చేరుకుని అక్కడ కూడా హిందీ అధ్యయనానికి అవసరమైన చర్యలను పర్యవేక్షిస్తారు. ఈ నేపథ్యంలో విశ్వ హిందీ పరిషత్తు నేతృత్వంలో సంయోజకుడు విపన్ కుమార్ మంగళవారం అచార్య యార్లగడ్డకు డిల్లీలో స్వాగతం పలికి మెమొంటో, శాలువాతో సత్కరించారు. ఈ క్రమంలో యార్లగడ్డ మంగళవారం అమెరికా బయలు దేరి వెళ్లారు.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









