కస్టమర్ దాడిలో గాయపడ్డ భారతీయ ప్రవాసి మృతి
- January 24, 2024
బహ్రెయిన్: బహ్రెయిన్లో కస్టమర్ తో జరిగిన గొడవల్లో తీవ్రంగా గాయపడ్డ కె. బషీర్ బీడీఎఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెండాడు. రిఫా హజియత్లో 25 ఏళ్లుగా కోల్డ్ స్టోర్ నిర్వహిస్తున్న కె. బషీర్.. ఒక అరబ్ కస్టమర్ గత వారం కొనుగోలు చేయడానికి అతని దుకాణానికి వచ్చారు. ఈ క్రమంలో కస్టమర్ తీసుకున్న వస్తువులకు డబ్బు ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా.. బషీర్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో కిందపడ్డ బషీర్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో నాలుగు రోజుల పాటు వెంటిలేటర్ సపోర్ట్పై ఉన్న అతను మంగళవారం ఉదయం మరణించాడు. సీసీటీవీ ఫుటేజీతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ కేసును పర్యవేక్షిస్తున్నట్లు ఇండియన్ ఎంబసీ, KMCC (కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్) వెల్లడించాయి. చనిపోయిన బషీర్కు భార్య హైరున్నీసా, కుమారులు ఫాబియాస్, నిహాల్ ఉన్నారు.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







