టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి నియామకం
- January 25, 2024
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం అయ్యారు. మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలిపారు. కొద్ది రోజుల క్రితం వరకు ఐఏఎస్ అధికారి జనార్ధన్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్గా కొనసాగిన సంగతి తెలిసిందే. ఆయన హయాంలో టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు వేసింది. చైర్మన్తో పాటు సభ్యులందరూ రాజీనామా చేశారు. తాజాగా కొత్త చైర్మన్ను నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం. సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ ఉల్లాఖాన్, యాదయ్య, వై రాంమోహన్ రావు నియమితులయ్యారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







