దుబాయ్-నార్తర్న్ ఎమిరేట్స్ మధ్య కొత్త ఫెడరల్ హైవే!
- January 25, 2024
యూఏఈ: మొత్తం ఏడు ఎమిరేట్లను కలుపుతూ కొత్త ఫెడరల్ హైవేని నిర్మించే ప్రతిపాదనను యూఏఈ పరిశీలిస్తుంది. ఇది పూర్తయితే పాన్-యూఏఈ హైవేల సంఖ్య నాలుగుకి చేరుకుంటుంది. ఇదివరకే అల్ ఇత్తిహాద్ (E11), షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ (E311) మరియు ఎమిరేట్స్ (E611) రోడ్లు ట్రాఫిక్ సమస్యను గణనీయంగా తగ్గించాయి. బుధవారం ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (FNC)ని ఉద్దేశించి ఇంధనం మరియు మౌలిక సదుపాయాల మంత్రి సుహైల్ బిన్ మొహమ్మద్ అల్ మజ్రోయీ ప్రసంగించారు. ట్రాఫిక్ కష్టాలను తగ్గించడానికి కొత్త రహదారిని నిర్మించడానికి FNC సమర్పించిన ప్రతిపాదనను మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తుందని ఆయన చెప్పారు. ముఖ్యంగా దీని ద్వారా నార్తర్న్ ఎమిరేట్స్లో నివసిస్తూ దుబాయ్లో పనిచేసే ఉద్యోగులకు మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. అల్ ఇతిహాద్, షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ మరియు ఎమిరేట్స్ రోడ్లు ప్రస్తుతం 20 కంటే తక్కువ లేన్లను కలిగి ఉన్నాయి. దుబాయ్లోకి ప్రవేశించడానికి దాదాపు 10 లేన్లు ఉన్నాయి. ఈ రోడ్లు దుబాయ్-నార్తర్న్ ఎమిరేట్స్ మధ్య 850,000 వాహనాలు ప్రయాణిస్తున్నాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







