మస్కట్‌లో ఘనంగా 75వ భారత గణతంత్ర దినోత్సవం

- January 26, 2024 , by Maagulf
మస్కట్‌లో ఘనంగా 75వ భారత గణతంత్ర దినోత్సవం

మస్కట్: మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న ఉదయం ఘనగా జరుపుకుంది. ఒమన్ సుల్తానేట్‌లో భారత రాయబారి అమిత్ నారంగ్ తోపాటు 500 మందికి పైగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రాయబారి అమిత్ నారంగ్, అతని భార్య దివ్య నారంగ్ ఎంబసీలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇండియన్ స్కూల్ బౌషర్ విద్యార్థులు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి భారత రాష్ట్రపతి చేసిన ప్రసంగంలోని సారాంశాలను రాయబారి చదివి వినిపించారు. ఇండియన్ స్కూల్ బౌషర్ విద్యార్థులు రెండు దేశభక్తి గీతాలను ప్రదర్శించడంతో కార్యక్రమం ముగిసింది. గణతంత్ర దినోత్సవ వేడుకల కొనసాగింపుగా.. జనవరి 28న సాయంత్రం ఎంబసీ ద్వారా గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com