విజటర్స్ ఎంట్రీ కోసం ఆటోమేటెడ్ గేట్ల వద్ద బార్కోడ్ స్కానర్లు
- January 26, 2024
రియాద్: ప్రవక్త మసీదు ఏజెన్సీ , సంబంధిత అధికారులు మదీనాలోని ప్రవక్త మసీదు వద్ద రౌదా షరీఫ్ను సందర్శించడానికి కొత్త సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. ఇకపై రౌదా షరీఫ్లోకి ప్రవేశించడానికి సందర్శకులు ఆటోమేటెడ్ గేట్ల వద్ద బార్కోడ్ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. రౌదా సందర్శనకు సంబంధించిన విధానాలు తప్పనిసరిగా నుసుక్ ప్లాట్ఫారమ్ ద్వారా అప్లై చేసుకోవాలని ఏజెన్సీ పేర్కొంది. అప్లికేషన్ ద్వారా రిజర్వేషన్ చేసిన తర్వాత సందర్శకుడు అపాయింట్మెంట్ను నిర్ధారిస్తూ మెసేజ్ ను అందుకుంటారు. తరువాత, సందర్శకుడికి సందర్శన తేదీకి 24 గంటల ముందు అపాయింట్మెంట్ గురించి మరోసారి గుర్తుచేస్తారు. విజిటర్ నిర్ధిష్ట సమయానికి ముందు సందర్శన కోసం బార్కోడ్ను ఉపయోగించడం సాధ్యం కాదని అధికారులు తెలిపారు. రౌదా షరీఫ్కు చేరుకోవడానికి ముందు, సందర్శకుడు బార్కోడ్ను ఆటోమేటెడ్ గేట్ల ద్వారా స్కాన్ చేసి, ఆపై వేచి ఉండే ప్రదేశానికి వెళ్లి, ఆపై ప్రవేశం పొందాల్సి ఉంటుంది. సందర్శకుల సంఖ్యను తెలుసుకోవడానికి స్మార్ట్ కెమెరాలు, సెన్సార్ల ద్వారా పనిచేసే అధునాతన డిజిటల్ సిస్టమ్ల ద్వారా కూడా ఫాలో-అప్ చేయబడుతుందన్నారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









