షార్జా అగ్నిప్రమాదంలో తండ్రి, కూతురు మృతి
- January 26, 2024
యూఏఈ: షార్జాలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో పాకిస్థాన్ జాతీయుడు, అతని కుమార్తె మరణించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మృతిచెందిన ఇమ్రాన్ ఖాన్ మరియు అతని కుటుంబం షార్జాలో నివసిస్తున్నారని యూఏఈలోని పాకిస్తాన్ రాయబారి ఫైసల్ తిర్మిజీ చెప్పారు. ఖాన్ భార్య, ఇద్దరు పిల్లలు షార్జాలోని అల్ ఖాసిమి హాస్పిటల్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నారు. "జనవరి 25న ఉదయం షార్జాలో ఉన్న ఒక పాకిస్తానీ ఇంట్లో దురదృష్టకర ప్రమాదం జరిగింది. ఇందులో కుటుంబ పెద్ద ఇమ్రాన్ ఖాన్, అతని ఒక కుమార్తె ఈ సంఘటనలో మరణించారు. అతని భార్య మరియు ఇద్దరు పిల్లలు అల్ ఖాసిమి హాస్పిటల్ ICUలో చికిత్స పొందుతున్నారు. ”అని రాయబారి తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







