మొదటి రోజు 500 కుటుంబ వీసాలు జారీ!
- January 29, 2024
కువైట్: నివాసితులు కుటుంబ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించాలన్న మంత్రివర్గ నిర్ణయం అమలులోకి వచ్చిన మొదటి రోజున, ఆరు గవర్నరేట్లలోని రెసిడెన్సీ వ్యవహారాల విభాగాలు సుమారు 2,000 మంది దరఖాస్తుదారులను స్వీకరించాయి. ఇందులో కేవలం 500 దరఖాస్తులు మాత్రమే కుటుంబ వీసా కోసం అవసరమైన షరతులను కలిగి ఉన్నాయని వెల్లడించాయి. నివేదికల ప్రకారం, నిషేధిత దేశాలైన ఇరాకీ, సిరియన్, ఆఫ్ఘన్, పాకిస్తానీ, ఇరానియన్, యెమెన్ మరియు సుడానీస్ వ్యక్తుల నుండి లావాదేవీల గురించి రెసిడెన్సీ వ్యవహారాల విభాగానికి ఇంకా సూచనలు అందలేదు. ఈ జాతీయుల దరఖాస్తులు ప్రస్తుతం హోల్డ్లో ఉన్నాయి. కుటుంబ వీసా 14 ఏళ్లలోపు వారి జీవిత భాగస్వాములు, పిల్లలను తీసుకురావడానికి మాత్రమే అని అధికార వర్గాలు ధృవీకరించాయి. ఈ నిర్ణయం తల్లిదండ్రులు, తోబుట్టువుల స్పాన్సర్షిప్ను అనుమతించదు. కుటుంబ వీసా పొందడానికి వర్క్ పర్మిట్పై కనీసం 800 KD జీతం, వారు పనిచేస్తున్న అదే రంగంలో విశ్వవిద్యాలయ డిగ్రీని కలిగి ఉండాలని తెలిపింది. యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ తప్పనిసరిగా దరఖాస్తుదారు స్వదేశంలోని కువైట్ రాయబార కార్యాలయం ద్వారా ధృవీకరించబడాలి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖచే ఆమోదించబడాలి. దీంతోపాటు వివాహ ఒప్పందాలు, పిల్లల జనన ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా ధృవీకరించబడాలి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







