టీటీడీ వార్షిక బడ్జెట్ 2024-25కు పాలకమండలి ఆమోదం
- January 29, 2024
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ కు పాలకమండలి సోమవారం ఆమోదం తెలిపింది. రూ. 5141.75 కోట్లతో 2024-25 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ రూపొందించారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో సభ్యులు వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం, బ్రేక్ దర్శనాల ద్వారా 338 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని టీటీడీ అంచనా వేసింది.
సాధారణంగా టీటీడీ వార్షిక బడ్జెట్ను ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఆమోదిస్తుంటారు. అయితే ఈసారి జనవరిలోనే వార్షిక బడ్జెట్ను టీటీడీ పాలకమండలి ఆమోదించింది. త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావొచ్చన్న అంచనాలతో ముందుగానే వార్షిక బడ్జెట్ను రూపొందించారు.
టీటీడీ వార్షిక బడ్జెట్ ఆదాయం అంచనాలు
హుండీ ఆదాయం రూ.1611 కోట్లుగా అంచనా
వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల ద్వారా రూ.1167 కోట్ల వడ్డీ రాబడి
ఇతర పెట్టుబడిల ద్వారా రూ.129 కోట్లు ఆదాయం
ప్రత్యేక ప్రవేశ దర్శనం, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.338 కోట్లు ఆదాయం
టీటీడీ వార్షిక బడ్జెట్ కేటాయింపులు
ఉద్యోగుల జీతభత్యాలకు రూ.1733 కోట్లు
నిత్యవసరాలు కొనుగోళ్లకు రూ.751 కోట్ల కార్పస్ ఫండ్
ఇతర పెట్టుబడులకు రూ.750 కోట్లు
ఇంజనీరింగ్ పనులకు రూ.350 కోట్లు
శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ కు రూ. 53 కోట్లు
స్విమ్స్ ఆస్పత్రి అభివృద్ధి పనులకు రూ.60 కోట్లు
ఇంజనీరింగ్ మెయిన్టనెన్స్ పనులకు రూ.190 కోట్లు
తాజా వార్తలు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- యాంటీడ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ‘రీఅష్యూర్డ్ హోమ్స్’ తో కుటుంబాలకు ఉపశమనం..!!
- సమ్మర్ వర్కింగ్ అవర్స్ వయోలేషన్ రిపోర్టుకు ప్రత్యేక ఛానెల్స్..!!
- GMR ఏరోస్పేస్ పార్క్లో ఎఫ్టీజీ తొలి భారత తయారీ కేంద్రం ప్రారంభం
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్







