జబల్ అఖ్దర్ టూరిజానికి పునరుజ్జీవం

- January 29, 2024 , by Maagulf
జబల్ అఖ్దర్ టూరిజానికి పునరుజ్జీవం

మస్కట్: జబల్ అఖ్దర్‌లోని పర్యాటక రంగం కొత్త రోడ్డు ప్రాజెక్టులు,  ప్రతిపాదిత విమానాశ్రయం కోసం ప్రణాళికలతో గణనీయమైన ప్రోత్సాహాన్ని అందుకోనుందని పర్యాటక పరిశ్రమ నిపుణులు తెలిపారు.  రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రస్తుతం దక్షిణ అల్ బతినా నుండి జబల్ అఖ్దర్ వరకు ప్రత్యామ్నాయ మార్గాన్ని రూపొందించే ప్రాణాళికపై పనిచేస్తోంది. కొత్త రహదారి నిర్మాణం జబల్ అఖ్దర్‌కు సులభంగా యాక్సెస్‌ను అందించడం, ఫోర్-వీల్ డ్రైవ్ వాహనాల అవసరాన్ని తొలగించడం, సుందరమైన పచ్చని పర్వతాలకు పర్యాటకుల రద్దీని పెంచడం దీని లక్ష్యంగా ఉందని పేర్కొంది. ఇటీవలి జరిగిన అభివృద్ధిలో జబల్ అఖ్దర్, మసీరా మరియు సోహార్ విమానాశ్రయాల ప్రతిపాదిత అభివృద్ధి కోసం సైట్ ఎంపిక అధ్యయనాలు, మాస్టర్ ప్లాన్‌లు, డిజైన్ మరియు పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంపెనీల నుండి పౌర విమానయాన అథారిటీ (CAA) టెండర్‌లను ఆహ్వానించింది. నసీమ్ రిసార్ట్ జబల్ అఖ్దర్ జనరల్ మేనేజర్ జగ్‌దీప్ థక్రాల్ మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల తర్వాత ఈ ప్రాంతంలో టూరిజం పెరుగుతుందన్నారు. సింగపూర్‌లోని ప్రసిద్ధ స్కైలైన్ లూజ్ మాదిరిగానే సందర్శకులు సహజంగా క్రిందికి వెళ్లగలిగే పారాగ్లైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్ సేవలు మరియు కేబుల్ కార్ రైడ్‌ల వంటి కార్యకలాపాలను పరిచయం చేయాలని థక్రాల్ ప్రతిపాదించారు.  మరోవైపు పచ్చని పర్వతాలకు ప్రసిద్ధి చెందిన జబల్ అఖ్దర్ 2023 మొదటి తొమ్మిది నెలల్లో సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మొత్తం 161,974 మంది పర్యటించారని నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) వెల్లడించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com