ఫిబ్రవరి 1 నుంచి బహ్రెయిన్‌లో రొయ్యలపై నిషేధం

- January 29, 2024 , by Maagulf
ఫిబ్రవరి 1 నుంచి బహ్రెయిన్‌లో రొయ్యలపై నిషేధం

బహ్రెయిన్: చేపల వనరులను సంరక్షించే ప్రయత్నాల్లో భాగంగా బహ్రెయిన్‌లో రొయ్యలను పట్టుకోవడం, వ్యాపారం చేయడం లేదా విక్రయించడంపై నిషేధం ఫిబ్రవరి 1న ప్రారంభమై జూలై 31 వరకు కొనసాగుతుంది. మునిసిపాలిటీస్ వ్యవహారాలు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖలో వ్యవసాయ వ్యవహారాలు, సముద్ర వనరుల అండర్ సెక్రటరీ హిస్ ఎక్సెలెన్సీ డాక్టర్ ఖలీద్ అహ్మద్ హసన్ మాట్లాడుతూ..  వార్షిక నిషేధం సముద్ర వనరులను సంరక్షించడానికి గల్ఫ్ సహకార మండలి (GCC) నిర్ణయాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తనిఖీ ప్రచారాలను పర్యవేక్షక సంస్థలు, బహ్రెయిన్ కోస్ట్ గార్డ్ నిర్వహిస్తాయన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com