2025లో సౌదీ అరేబియాలో డసెర్ట్ లగ్జరీ ట్రైన్!
- January 29, 2024
రియాద్: సౌదీ అరేబియా రైల్వేస్ (SAR), లగ్జరీ రైలు ప్రయాణాలను నిర్వహించడంలో నైపుణ్యం కలిగిన ఇటాలియన్ ఆర్సెనెల్ గ్రూప్.. సౌదీ అరేబియాలో డ్రీమ్ ఆఫ్ ది డెసర్ట్ లగ్జరీ రైలు సేవను ప్రారంభించేందుకు ఒప్పందం చేసుకున్నాయి. 40 లగ్జరీ క్యాబిన్లు, గరిష్టంగా 80 మంది ప్రయాణీకులను కలిగి ఉండే డ్రీమ్ ఆఫ్ ది డెసర్ట్ రైలు 2025 వేసవిలో సౌదీ అరేబియాకు చేరుకోనుంది. మొదటి పేయింగ్ గెస్ట్లు నవంబర్ 2025లో బయలుదేరతారని అంచనా వేశారు. రవాణా మరియు లాజిస్టిక్స్ మంత్రి మరియు బోర్డు ఛైర్మన్ సమక్షంలో ఇటీవల జరిగిన ఒప్పంద కార్యక్రమంలో SAR సీఈఓ డాక్టర్ బషర్ అల్-మాలిక్, ఆర్సెనెల్ గ్రూప్ డైరెక్టర్ల బోర్డు CEO పాలో బార్లెట్టా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోసౌదీ అరేబియా రైల్వేస్ (SAR) డైరెక్టర్ల ఇంజి. సలేహ్ అల్-జాసర్ కూడా ఉన్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. సౌదీ అరేబియా అంతటా "రైల్ క్రూజింగ్" కోసం మొదటి లగ్జరీ రైలు రియాద్ నుండి జోర్డాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఉత్తర నగరం అల్-ఖురాయత్ హేల్ గుండా 770 మైళ్ల మార్గంలో నడుస్తుంది. ఈ సందర్భంగా అల్-జాసర్ మాట్లాడుతూ.. మధ్యప్రాచ్యం మరియు ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో మొదటిసారిగా కింగ్డమ్లో లగ్జరీ రైలు సేవలను ప్రారంభించడం వల్ల రాజ్యంలో రవాణా రంగంలో గుణాత్మక సేవలు ప్రారంభం అవుతాయన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







