జబల్ అఖ్దర్ టూరిజానికి పునరుజ్జీవం
- January 29, 2024
మస్కట్: జబల్ అఖ్దర్లోని పర్యాటక రంగం కొత్త రోడ్డు ప్రాజెక్టులు, ప్రతిపాదిత విమానాశ్రయం కోసం ప్రణాళికలతో గణనీయమైన ప్రోత్సాహాన్ని అందుకోనుందని పర్యాటక పరిశ్రమ నిపుణులు తెలిపారు. రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రస్తుతం దక్షిణ అల్ బతినా నుండి జబల్ అఖ్దర్ వరకు ప్రత్యామ్నాయ మార్గాన్ని రూపొందించే ప్రాణాళికపై పనిచేస్తోంది. కొత్త రహదారి నిర్మాణం జబల్ అఖ్దర్కు సులభంగా యాక్సెస్ను అందించడం, ఫోర్-వీల్ డ్రైవ్ వాహనాల అవసరాన్ని తొలగించడం, సుందరమైన పచ్చని పర్వతాలకు పర్యాటకుల రద్దీని పెంచడం దీని లక్ష్యంగా ఉందని పేర్కొంది. ఇటీవలి జరిగిన అభివృద్ధిలో జబల్ అఖ్దర్, మసీరా మరియు సోహార్ విమానాశ్రయాల ప్రతిపాదిత అభివృద్ధి కోసం సైట్ ఎంపిక అధ్యయనాలు, మాస్టర్ ప్లాన్లు, డిజైన్ మరియు పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంపెనీల నుండి పౌర విమానయాన అథారిటీ (CAA) టెండర్లను ఆహ్వానించింది. నసీమ్ రిసార్ట్ జబల్ అఖ్దర్ జనరల్ మేనేజర్ జగ్దీప్ థక్రాల్ మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల తర్వాత ఈ ప్రాంతంలో టూరిజం పెరుగుతుందన్నారు. సింగపూర్లోని ప్రసిద్ధ స్కైలైన్ లూజ్ మాదిరిగానే సందర్శకులు సహజంగా క్రిందికి వెళ్లగలిగే పారాగ్లైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్ సేవలు మరియు కేబుల్ కార్ రైడ్ల వంటి కార్యకలాపాలను పరిచయం చేయాలని థక్రాల్ ప్రతిపాదించారు. మరోవైపు పచ్చని పర్వతాలకు ప్రసిద్ధి చెందిన జబల్ అఖ్దర్ 2023 మొదటి తొమ్మిది నెలల్లో సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మొత్తం 161,974 మంది పర్యటించారని నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) వెల్లడించింది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!







