సైనసైటిస్ వున్న వాళ్లు ఈ డైట్ తప్పక పాఠించాల్సిందే.!
- January 29, 2024
బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ద్వారా ఇన్ఫ్లమేటరీ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల సైనసైటిస్ వస్తుంది. సైనస్ వున్నవాళ్లలో తరచూ తలనొప్పి, ముక్కు కారడం.. వంటి లక్షణాలతో బాధపడుతుంటారు.
నాసికా రంధ్రాలు మూసుకు పోవడంతో గాలి పీల్చుకోవడం ఇబ్బందవుతుంది. అయితే, సైనస్ సమస్యకు శాశ్వత పరిష్కారం వుందా.? అంటే.. ప్రస్తుతం అనేక రకాల మందులు, సర్జరీ చికిత్సలు అందుబాటులో వున్నాయ్.
అయితే, ఒక్కసారి సైనస్ ఎటాక్ అయినవాళ్లు తప్పనిసరిగా తమ జీవన శైలిలో మార్పులు చేసుకోవాల్సిందే. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాఠించాలి.స
పాలు, పాల సంబంధిత ఉత్పత్తులు శ్లేష్మాన్ని చిక్కదనం చేస్తాయ్. తద్వారా ముక్కు మరింతగా పట్టేసినట్లుండడం, నాసికా రంధ్రాల ద్వారా శ్వాస తీసుకోవడం ఇబ్బందవుతుంది.
చక్కెర వినియోగం సైనస్ వున్నవారికి చాలా పెద్ద సమస్యగా చెప్పొచ్చు. వీలైనంత తక్కువగా చక్కెరను వినియోగించాలి. చక్కెర వాడకం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. తద్వారా తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లతో పోరాటం చేసే శక్తి శరీరానికి తగ్గుతుంది. సైనస్ వ్యాధిగ్రస్థులకు ఇది ఓ శాపమే అని చెప్పొచ్చు.
ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాలను తీసుకోవడం వల్ల సైనస్ వాపు వేధిస్తుంది. అలాగే మసాలా అధికంగా వున్న ఆహారాన్ని కూడా తక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







