ఏప్రిల్ 21 నుండి ట్రక్కులు, బస్సులపై ఆటోమేటిక్ నిఘా
- January 30, 2024
రియాద్: ట్రక్కులు, బస్సుల ద్వారా జరిగే ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఆటోమేటెడ్ నిఘాను ప్రారంభించినట్లు రవాణా జనరల్ అథారిటీ (TGA) ప్రకటించింది. ఇది రాజ్యంలో వివిధ ప్రాంతాలలో ఏప్రిల్ 21 నుండి అమలులోకి వస్తుందని తెలిపింది. ట్రక్కులు, బస్సులలో కార్గో రవాణా, ట్రక్కు అద్దె, అంతర్జాతీయ రవాణా బస్సులు, అద్దె బస్సులు వీటి కిందకు వస్తాయని పేర్కొంది. ట్రాఫిక్ భద్రతను పెంపొందించడం, అధికారం ద్వారా నిర్దేశించిన నిబంధనలు మరియు సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ట్రక్కులు, బస్సుల ఉల్లంఘనలను తగ్గించే లక్ష్యంతో కొత్త నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ తెలిపింది. అదే సమయంలో కార్బన్ ఉద్గారాల రేట్లను తగ్గించడానికి ఇది దోహదం చేస్తుందని పేర్కొంది. ఏప్రిల్ 21 నుండి ఆటోమేటిక్ నిఘాలో భాగంగా ఆపరేటింగ్ కార్డ్ పొందకుండా ట్రక్ లేదా బస్సును నడపడం, గడువు ముగిసిన కార్డ్తో ట్రక్ లేదా బస్సును నడపడం, అలాగే బస్సు లైఫ్ టైం ముగియడాన్ని కూడా పర్యవేక్షించే అవకాశం ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక







