ఏప్రిల్ 21 నుండి ట్రక్కులు, బస్సులపై ఆటోమేటిక్ నిఘా
- January 30, 2024
రియాద్: ట్రక్కులు, బస్సుల ద్వారా జరిగే ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఆటోమేటెడ్ నిఘాను ప్రారంభించినట్లు రవాణా జనరల్ అథారిటీ (TGA) ప్రకటించింది. ఇది రాజ్యంలో వివిధ ప్రాంతాలలో ఏప్రిల్ 21 నుండి అమలులోకి వస్తుందని తెలిపింది. ట్రక్కులు, బస్సులలో కార్గో రవాణా, ట్రక్కు అద్దె, అంతర్జాతీయ రవాణా బస్సులు, అద్దె బస్సులు వీటి కిందకు వస్తాయని పేర్కొంది. ట్రాఫిక్ భద్రతను పెంపొందించడం, అధికారం ద్వారా నిర్దేశించిన నిబంధనలు మరియు సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ట్రక్కులు, బస్సుల ఉల్లంఘనలను తగ్గించే లక్ష్యంతో కొత్త నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ తెలిపింది. అదే సమయంలో కార్బన్ ఉద్గారాల రేట్లను తగ్గించడానికి ఇది దోహదం చేస్తుందని పేర్కొంది. ఏప్రిల్ 21 నుండి ఆటోమేటిక్ నిఘాలో భాగంగా ఆపరేటింగ్ కార్డ్ పొందకుండా ట్రక్ లేదా బస్సును నడపడం, గడువు ముగిసిన కార్డ్తో ట్రక్ లేదా బస్సును నడపడం, అలాగే బస్సు లైఫ్ టైం ముగియడాన్ని కూడా పర్యవేక్షించే అవకాశం ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







