నారీ నారీ నడుమ మురారిగా శర్వానంద్.!
- January 30, 2024
యంగ్ హీరో శర్వానంద్ పేరు ఈ మధ్య అస్సలు సోదిలో లేకుండా పోయింది. ఆ మధ్య పెళ్లి కార్యక్రమాలతో ట్రెండింగ్ అయిన శర్వానంద్, పెళ్లి తర్వాత బొత్తిగా మాటల్లో లేకుండా పోయాడు.
వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు కాబోలు. మళ్లీ ఇప్పుడే కెరీర్పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎప్పుడో రెండు ప్రాజెక్టులు శర్వానంద్ ఓకే చేసి పెట్టాడు. అందులో ఒకటి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఖాతాలోనూ ఇంకోటి ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారి ఖాతాలో ఒకటి.
తాజాగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందబోయే సినిమాకి సంబంధించి అప్డేట్ బయటికొచ్చింది. ఈ సినిమాలో శర్వానంద్ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారట.
వాళ్లెవరో కాదు, గుడ్ లక్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సంయుక్తా మీనన్ ఒకరు కాగా, డెబ్యూ మూవీ ఫెయిల్యూర్ అయినా హీరోయిన్గా మంచి పేరు దక్కించుకున్న సాక్షి వైద్య ఇంకోకరు.
ఈ ఇద్దరు ముద్దుగుమ్మలతో శర్వానంద్ ఆన్ స్క్రీన్ రొమాన్స్కి సిద్ధమవుతున్నాడట. అయితే, ఈ సినిమా కథా, కమామిషు గట్రా పూర్తి వివరాలు వెల్లడి కావల్సి వుంది. ఏది ఏమైతేనేం, మొత్తానికి శర్వా అయితే ఆన్లోకి వచ్చేశాడు. చూడాలి మరి, ఎలాంటి కొత్త కాన్పెప్లులతో ప్రేక్షకుల ముందుకు వస్తాడో.!
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







