బంగారం స్మగ్లింగ్ ఆపరేషన్ భగ్నం.. Dh800,000 విలువైన ఆభరణాలు స్వాధీనం
- January 31, 2024
యూఏఈ: షార్జా పోలీసులు 800,000 దిర్హామ్ల విలువైన ఆభరణాలతో కూడిన భారీ బంగారం స్మగ్లింగ్ ఆపరేషన్ను అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఖోర్ఫక్కన్లోని ఓ దుకాణంలో అర్థరాత్రి నగలు దోచుకెళ్లారు. షార్జా పోలీస్ ఆపరేషన్స్ రూమ్ కి సమాచారం అందింది. వెంటనే నేరం జరిగిన ప్రదేశానికి పోలీసులు చేరుకున్నారు. సాక్ష్యాలను సేకరించి దర్యాప్తు చేసేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని గంటలపాటు విచారణ జరిపిన బృందం దోపిడీకి పాల్పడిన ముఠా సభ్యులను గుర్తించారు. దొంగిలించబడిన నగలను కూడా ఓడరేవులో షిప్పింగ్ కంటైనర్లో పోలీసులు గుర్తించారు. మరుసటి రోజు ఉదయం దేశం నుండి రవాణా చేయడానికి అది సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ముఠా సభ్యులను అరెస్టు చేయడానికి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు అరెస్టయిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కేసును ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. వాణిజ్య సంస్థల యజమానులు తమ దుకాణాలకు భద్రతను ఏర్పాటు చేసుకోవాలని, నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని. షార్జా పోలీసులు పిలుపునిచ్చారు. ఇలాంటి సంఘటనలను నివేదించడానికి ఎమర్జెన్సీ నంబర్ 999ని ఉపయోగించాలని సూచించారు.
తాజా వార్తలు
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక







