మలేషియా కొత్త రాజుగా సుల్తాన్ ఇబ్రహీం..
- January 31, 2024
కౌలాలంపూర్: మలేషియాకు కొత్త రాజు వచ్చారు. కౌలాలంపూర్ లోని జాతీయ ప్యాలెస్ లో బుధవారం జరిగిన కార్యక్రమంలో మలేషియా దక్షిణ రాష్ట్రమైన జోహోర్ కు చెందిన సుల్తాన్ ఇబ్రహీం దేశ నూతన రాజుగా ప్రమాణ స్వీకారం చేశారు. మలేషియాలో ఇంకా రాచరికం కొనసాగుతున్నప్పటికీ అది ఉత్సవ విగ్రహ పాత్రనే పోషిస్తుంది. కానీ కొన్ని సంవత్సరాల కిందట నుంచి దాని ప్రభావం కూడా పెరిగింది. ఇక్కడి రాజుకు విచక్షణాధికారాలు ఉంటాయి. రాజకీయ అస్థిరతను అణచివేయడానికి ఆ అధికారులు ఇటీవల ఉపయోగపడుతున్నాయి.
మలేషియాలో ప్రత్యేకమైన రాచరిక వ్యవస్థ అమల్లో ఉంది. తొమ్మిది రాజకుటుంబాల అధిపతులు ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒక సారి రాజుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వీరిని ‘‘యాంగ్ డి-పెర్టువాన్ అగోంగ్’’ అని పిలుస్తారు.
తాజాగా రాజుగా మారిన 65 ఏళ్ల సుల్తాన్ ఇబ్రహీం..అల్ సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా స్థానంలో బాధ్యతలు చేపట్టారు. ఆయన పహాంగ్ కు నాయకత్వం వహిస్తూ ఇటీవలే తన ఐదు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే రాచరికం ఎక్కువగా రాజకీయాలకు అతీతంగా కనిపించినప్పటికీ.. సుల్తాన్ ఇబ్రహీం ముక్కుసూటి మనషిగా, బహిరంగ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా పేరుగాంచారు. ఆయన తరచు దేశ రాజకీయ సమస్యలపై దృష్టి నిలిపేవారు.
భారీగా విలాసవంతమైన కార్లు, మోటారు సైకిళ్లను తన కలెక్షన్ లో ఉంచుకునే ఆయనకు రియల్ ఎస్టేట్ నుండి మైనింగ్ వరకు విస్తృతమైన వ్యాపారాలు ఉన్నాయి. జోహోర్ వద్ద 100 బిలియన్ డాలర్ల చైనా మద్దతుతో భూ పునరుద్ధరణ, డెవలప్ మెంట్ ప్రాజెక్టులో సుల్లాన్ ఇబ్రహీంకు ఫారెస్ట్ సిటీలో వాటా కూడా ఉంది.
తాజా వార్తలు
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!







