‘జై హనుమాన్’ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అంచనాలు అదుర్స్.!
- January 31, 2024
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని ఓ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసేసుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడిదే హాట్ టాపిక్గా మారింది టాలీవుడ్ ఇండస్ట్రీలో. టాలీవుడ్లోనే కాదు.. ఈ సినిమాటిక్ యూనివర్స్ ప్యాన్ ఇండియా స్థాయిలో పాపులర్ కాబోతోంది.
ఆల్రెడీ ఆ స్థాయి గుర్తింపు దక్కించేసుకుంది ‘హనుమాన్’ సినిమాతో. ఇక, ఇప్పుడు దీనికి సీక్వెల్గా రాబోతున్న ‘జై హనుమాన్’తో ఆ స్థాయిని మరింత పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయ్.
అసలు మ్యాటర్ ఏంటంటే, ‘జై హనుమాన్’లో హనుమంతుడి పాత్ర స్టార్ హీరో చేస్తాడు.. అని ప్రశాంత్ వర్మ ప్రకటించినప్పటి నుంచీ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయ్.
ఆ స్టార్ హీరో ఎవరన్న అంశంపై ఆసక్తి నెలకొంది అంతటా. ఆ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవే అంటున్నారు. ప్రశాంత్ వర్మ దృష్టిలోనూ మెగాస్టార్ చిరంజీవే మెదులుతున్నారట.
అయితే, ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు కానీ, తాజాగా మరో ముచ్చట తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో రాముడి ప్రస్థావన కూడా వుండబోతోందనీ ‘హనుమాన్’ సినిమా చివరిలో హింట్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. సో, ఆ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో చూపించాల్సిందే.
మరి, ఆ పాత్రలో కనిపించబోయేదెవరంటే.. మహేష్ బాబు అట. ఆ మాట కూడా ప్రశాంత్ వర్మ రీసెంట్ేగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసేశారు. అంటే, ప్రశాంత్ వర్మ స్కెచ్ మామూలుగా లేదు. ఏకంగా సూపర్ స్టార్నీ, మెగాస్టార్నీ కూడా తన సినిమాటిక్ యూనివర్స్లోకి ఆహ్వానించేయబోతున్నాడన్నమాట. చూస్తుంటే.. ‘జై హనుమాన్’ ఆషా మాషీ మూవీ అయ్యేలా లేదు.
తాజా వార్తలు
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!









