గుజరాత్‌లో 4.1 తీవ్రతతో భూకంపం

- February 01, 2024 , by Maagulf
గుజరాత్‌లో 4.1 తీవ్రతతో భూకంపం

గుజరాత్‌: గుజరాత్‌లో కచ్‌ జిల్లాలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది.రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.1గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (NCS) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గురువారం ఉదయం 8.06 గంటల సమయంలో భూకంపం సంభవించింది. వెడల్పు : 24.27, పొడవు: 70.21,15 కిలోమీటర్ల లోతులో కచ్‌ జిల్లాలో భూకంపం సంభవించినట్లు ఎన్‌సిఎస్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com