అబుదాబి - అల్ ధన్నా మధ్య ట్రైన్ సర్వీస్ ప్రారంభం!
- February 01, 2024
యూఏఈ: అబుధాబి నగరం, అల్ ధన్నా ప్రాంతం మధ్య రైలు ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది. అబుధాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (అడ్నోక్) ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ టీమ్తో పాటు పరిశ్రమ - టెక్నాలజీ మంత్రి డాక్టర్ సుల్తాన్ అహ్మద్ అల్ జాబర్ ప్రారంభ ప్యాసింజర్ రైలులో ప్రయాణించారు. గత ఏడాది నవంబరులో ఎతిహాద్ రైల్ , అబుధాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (అడ్నాక్) అబుదాబి - అల్ ధాఫ్రాలోని అల్ ధన్నా మధ్య రైలు సేవలను ఏర్పాటు చేయడానికి ఒప్పందంపై సంతకం చేశాయి. అబుదాబికి పశ్చిమాన 250కిమీ దూరంలో ఉన్న అల్ ధన్నాలో 29వేల మంది నివసిస్తున్నారు. తాజా రైలు మార్గం ద్వారా అడ్నాక్ ఉద్యోగులకు ఇది మేలు చేయనుంది. ఎతిహాద్ ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసింది. 4 బోగీల ప్యాసింజర్ రైలులో మంత్రి, ఉన్నతాధికారులు ప్రయాణించారు. రైలు ప్యాసింజర్ సేవలు అల్ సిలా నుండి ఫుజైరా వరకు 11 నగరాలను కలుపుతాయి. రైళ్లు 200kmph వేగంతో నడుస్తాయి. ఇతర రవాణా మార్గాలతో పోలిస్తే ఇవి ప్రయాణ సమయాన్ని 30-40 శాతం తగ్గిస్తాయి. ప్రయోగ తేదీ ఇంకా ప్రకటించబడలేదు. కానీ 2030 నాటికి ప్రయాణీకుల సంఖ్య ఏటా 36.5 మిలియన్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







