BAPS హిందూ దేవాలయ సందర్శనకు విదేశాల నుండి భారీ డిమాండ్
- February 02, 2024
యూఏఈ: ఫిబ్రవరి 18న భక్తులు అందుబాటులోకి రానున్న చారిత్రాత్మక BAPS హిందూ మందిర్ను సందర్శించడానికి విదేశాల నుండి వచ్చిన వారితో సహా సందర్శకుల నుండి భారీ డిమాండ్ ఉందని ఆలయ ప్రాజెక్ట్ అధిపతి తెలిపారు. పింక్ ఇసుకరాయి ఆలయ ప్రారంభోత్సవం ఫిబ్రవరి 14 న జరగనుండగా.. ఫిబ్రవరి 18 నుండి సాధారణ ప్రజలకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. కళాకారులు చేతితో చెక్కిన రాతి శిల్పాలు మరియు ప్రత్యేక లక్షణాల శ్రేణితో ఈ ఆలయం యూఏఈతోపాటు విదేశాలలో ఉండేవారిని ఆకర్షిస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని BAPS స్వామినారాయణ్ సంస్థ గత సంవత్సరం ప్రజల కోసం ఆలయ సందర్శన కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. ఫిబ్రవరి 18న ప్రారంభం రోజున నమోదు చేసుకున్న యూఏఈ నివాసితులు హాజరు కావచ్చు. అయినప్పటికీ, మధ్యప్రాచ్యంలోని మొట్టమొదటి సాంప్రదాయ రాతి ఆలయాన్ని చూసేందుకు ఆసక్తిగా ఉన్న విదేశీ సందర్శకుల నుండి విపరీతమైన డిమాండ్ ఉన్నందున, ఇంకా నమోదు చేసుకోని నివాసితులు మార్చి 1 నుండి సందర్శించవలసిందిగా ఆలయ అధికారులు కోరారు. “ఇప్పటికే నమోదు చేసుకున్న విదేశీ సందర్శకుల నుండి భారీ ఆసక్తి ఉంది. కాబట్టి, యూఏఈ నివాసితులను మార్చి 1 తర్వాత సందర్శించవలసిందిగా మేము అభ్యర్థిస్తున్నాము” అని BAPS హిందూ మందిర్ ప్రాజెక్ట్ అధిపతి పూజ్య స్వామి బ్రహ్మవిహారిదాస్ చెప్పారు. మార్చి 1 నుండి ఆలయాన్ని సందర్శించాలనుకునే సంఘం సభ్యులు ప్రత్యేక వెబ్సైట్ లేదా ఫెస్టివల్ ఆఫ్ హార్మొనీ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ పింక్ ఇసుకరాయి దేవాలయ నిర్మాణం దాదాపు పూర్తయింది. 'ఫెస్టివల్ ఆఫ్ హార్మొనీ' పేరుతో గ్రాండ్ ఓపెనింగ్ కోసం అద్భుత నిర్మాణానికి తుది మెరుగులు దిద్దుతున్నారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









