భారతీయ ప్రయాణికుల కోసం ‘ప్రీ-అప్రూవ్డ్ వీసా ఆన్ అరైవల్‌’

- February 02, 2024 , by Maagulf
భారతీయ ప్రయాణికుల కోసం ‘ప్రీ-అప్రూవ్డ్ వీసా ఆన్ అరైవల్‌’

దుబాయ్: ఎమిరేట్స్ కొంతమంది భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌లకు ప్రీ-అప్రూవ్డ్ వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని ప్రకటించింది. ఎయిర్‌లైన్‌లో తమ ప్రయాణాన్ని బుక్ చేసుకున్న అర్హతగల భారతీయులకు ఈ ఎంపిక అందుబాటులో ఉంటుందని తెలిపింది. 14-రోజుల సింగిల్ ఎంట్రీ వీసాగా జారీ చేయబడిన ఈ కొత్త విధానం దుబాయ్‌కి చేరుకున్నప్పుడు ప్రయాణాన్ని సులువు చేస్తుందన్నారు.  

అర్హత, ఖర్చు

కనీసం ఆరు నెలల పాటు చెల్లుబాటు అయ్యే సాధారణ పాస్‌పోర్ట్ ఉన్న భారతీయ పౌరులు యూఏఈలో వీసా ఆన్ అరైవల్ పొందవచ్చు. భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు తప్పనిసరిగా అమెరికా వీసా లేదా గ్రీన్ కార్డ్ కలిగి ఉండాలి.  లేదా కనీసం ఆరు నెలల పాటు చెల్లుబాటు అయ్యే ఈయూ లేదా యూకే రెసిడెన్సీ ఉండాలి. అర్హత కలిగిన ప్రయాణికులు 2017 నుండి యూఏఈ విమానాశ్రయాలలో వీసా-ఆన్-రైవల్ పొందుతున్నారు. ప్రయాణికులు తమ విమానాల నుండి దిగిన తర్వాత వీసా సాధారణంగా ఇమ్మిగ్రేషన్ కౌంటర్‌లో స్టాంప్ చేయబడుతుంది. కొత్త సేవతో ఎమిరేట్స్ కస్టమర్‌లు వీసాను ముందస్తుగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఖర్చు $47, సేవా రుసుము $18.50గా నిర్ణయించారు. 

ఎలా దరఖాస్తు చేయాలి?

వినియోగదారులు తమ టిక్కెట్లను బుక్ చేసుకున్న తర్వాత, వారు ఎయిర్‌లైన్ యొక్క డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పొందవచ్చు. అప్పుడు వారు ‘యూఏఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోండి’ లింక్‌పై క్లిక్ చేయాలి. వీసా దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడానికి అవసరాలు, నిబంధనలు మరియు షరతులను నిర్దేశించే VFS గ్లోబల్ సర్వీసెస్ ద్వారా ఆధారితమైన ఆన్‌లైన్ యూఏఈ వీసా దరఖాస్తు సైట్‌కు రీడైరెక్ట్ అవుతారు. దుబాయ్ టూరిజం గణాంకాల ప్రకారం.. జనవరి నుండి అక్టోబర్ 2023 మధ్య భారతదేశం నుండి 2 మిలియన్ల మంది దుబాయ్ ను సందర్శించారు. ఎమిరేట్స్ ప్రస్తుతం 167 వారపు విమానాలతో భారతదేశంలోని తొమ్మిది గమ్యస్థానాలకు సేవలు అందిస్తోంది. భారతదేశంలోని ఎయిర్‌లైన్ నెట్‌వర్క్‌లో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, ముంబై మరియు తిరువనంతపురం ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com