బిజెపి అగ్రనేత ఎల్‌ కె.అద్వానీకి భారతరత్న

- February 03, 2024 , by Maagulf
బిజెపి అగ్రనేత ఎల్‌ కె.అద్వానీకి భారతరత్న

న్యూఢిల్లీ: బిజెపి అగ్రనేత ఎల్‌ కె.అద్వానీకి ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డును ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రకటించారు. ఈ మేరకు మోడి ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. ”అద్వానీకి భారతరత్న దక్కడం సంతోషంగా ఉంది. ఆయనతో మాట్లాడి నేనూ అభినందనలు తెలిపా. మన కాలంలో అత్యంత రాజనీతిజ్ఞుల్లో ఆయన ఒకరు. అట్టడుగు స్థాయి నుంచి ఉప ప్రధాని వరకు దేశాభివృద్ధిలో ఆయన పాత్ర కీలకం” అని పేర్కొన్నారు. జాతీయ ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం అద్వానీ అసమానమైన కృషి చేశారని మోడి ప్రశంసించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com