'యాత్ర 2' ట్రైలర్‌ రిలీజ్

- February 03, 2024 , by Maagulf
\'యాత్ర 2\' ట్రైలర్‌ రిలీజ్

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర'. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'యాత్ర 2' ఫిబ్రవరి 8న రిలీజ్‌ కానుంది.

వైఎస్సార్‌ తనయుడు, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' ఉంటుంది.

వైఎస్సార్‌, ఆయన తనయుడి జీవితంలో జరిగిన యథార్థంగా జరిగిన సంఘటనలే ఆధారంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ మహీ వి. రాఘవ్‌ తెరకెక్కించారు. ఈ చిత్రంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డిపాత్రలో మమ్ముట్టి, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాత్రలో జీవా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన యాత్ర-2 టీజర్‌, సాంగ్స్‌ సినీ ప్రేక్షకులతో పాటు వైఎస్సార్‌ అభిమానుల గుండెలను తాకాయి. తాజాగా యాత్రా 2 నుంచి ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com