జెబెల్ జైస్లో 3.4°C.. యూఏఈలో పెరిగిన చలి తీవ్రత
- February 04, 2024
యూఏఈ: జెబెల్ జైస్ పర్వతం ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దేశంలోని ఉత్తర దిశలో ఆదివారం నమోదైన 3.4°C ఉష్ణోగ్రత రికార్డు అయిందని, రస్ అల్ ఖైమాలోని నివాసితులకు ఎడారిలో శీతాకాలపు చల్లదనం వచ్చేసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రస్ అల్ ఖైమాలోని జెబెల్ జైస్ వద్ద శనివారం ఉదయం 5 గంటలకు (ఫిబ్రవరి 3) మంచుతో నిండిన 4.2ºC నమోదైంది. జనవరి 10న రక్నాలో అల్ ఐన్ వద్ద 5.3ºC రికార్డు అయింది. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ (NCM)E ప్రకారం.. అబుదాబి, దుబాయ్, షార్జా, ఫుజైరా, రస్ అల్ ఖైమా మరియు ఉమ్ అల్ క్వైన్ - ఏడు ఎమిరేట్స్లో ఆరింటిలో వర్షాలు నమోదయ్యాయి. ఖోర్ ఫక్కన్ లోనూ వర్షం నమోదైంది. ఫిబ్రవరి అంతటా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్త ఇబ్రహీం అల్-జర్వాన్ తెలిపారు. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) నిపుణుల ప్రకారం.. యూఏఈలో గత సంవత్సరాలతో పోలిస్తే ఇటీవల చలికాలం తక్కువగా ఉంది. గత సంవత్సరాల కంటే తక్కువ వర్షపాతంతో పాటు డిసెంబర్లో సగటు ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైంది.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







