ఇండియా-ఒమన్ చారిత్రక సంబంధాలపై లెక్చర్ సిరీస్
- February 06, 2024
మస్కట్: మస్కట్లోని భారత రాయబార కార్యాలయం ఆదివారం ఎంబసీ హాల్లో “ఫ్రం మాండ్వీ టు మస్కట్: ఇండియన్ కమ్యూనిటీ అండ్ ది షేర్డ్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఒమన్” సిరీస్లో మూడవ లెక్చర్ నిర్వహించింది. ప్రఖ్యాత చరిత్రకారుడు, ఆర్థికవేత్త, ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ “మాండ్వీ టు మస్కట్: ఐదు వేల సంవత్సరాల మార్పిడి” పై ఉపన్యాసం ఇచ్చారు. భారతదేశం - ఒమన్ మధ్య చారిత్రక సంబంధాలు, పురాతన సముద్ర సంబంధాలు, నౌకానిర్మాణ సంప్రదాయాలు, వాణిజ్యాన్ని చక్కగా వివరించారు. సన్యాల్ క్రీ.శ. 4వ-5వ శతాబ్దపు కాన్సెప్ట్ ఆధారంగా ఒక పురాతన ఓడను పునర్నిర్మించే భారత ప్రభుత్వం యొక్క ప్రాజెక్ట్పై వివరాలను వెల్లడించారు. ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలో మాండ్వి నుండి మస్కట్ వరకు ఓడలో ప్రయాణించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భారతీయ కమ్యూనిటీ, భారతీయ సంతతికి చెందిన ఒమానీలు, విశిష్ట అతిథులు ఉత్సాహంగా పాల్గొన్నారు. షా నాగర్దాస్ కుటుంబానికి చెందిన పరేష్ షా భారతదేశం - ఒమన్ మధ్య చారిత్రక సంబంధాలకు వారి సహకారాన్ని నొక్కి చెబుతూ తన కుటుంబ చరిత్రను వివరించారు. ముగింపులో ఒమన్ బుక్ లవర్స్ క్లబ్ వ్యవస్థాపకురాలు అనీషా పర్జిత్ నిర్వహించిన కార్యక్రమం అందరిని ఆకట్టుకున్నది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







