ఇండియా-ఒమన్ చారిత్రక సంబంధాలపై లెక్చర్ సిరీస్

- February 06, 2024 , by Maagulf
ఇండియా-ఒమన్ చారిత్రక సంబంధాలపై లెక్చర్ సిరీస్

మస్కట్: మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం ఆదివారం ఎంబసీ హాల్‌లో “ఫ్రం మాండ్వీ టు మస్కట్: ఇండియన్ కమ్యూనిటీ అండ్ ది షేర్డ్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఒమన్” సిరీస్‌లో మూడవ లెక్చర్ నిర్వహించింది. ప్రఖ్యాత చరిత్రకారుడు, ఆర్థికవేత్త, ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ “మాండ్వీ టు మస్కట్: ఐదు వేల సంవత్సరాల మార్పిడి” పై ఉపన్యాసం ఇచ్చారు. భారతదేశం - ఒమన్ మధ్య చారిత్రక సంబంధాలు,  పురాతన సముద్ర సంబంధాలు, నౌకానిర్మాణ సంప్రదాయాలు, వాణిజ్యాన్ని చక్కగా వివరించారు. సన్యాల్ క్రీ.శ. 4వ-5వ శతాబ్దపు కాన్సెప్ట్ ఆధారంగా ఒక పురాతన ఓడను పునర్నిర్మించే భారత ప్రభుత్వం యొక్క ప్రాజెక్ట్‌పై వివరాలను వెల్లడించారు. ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలో మాండ్వి నుండి మస్కట్ వరకు ఓడలో ప్రయాణించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భారతీయ కమ్యూనిటీ, భారతీయ సంతతికి చెందిన ఒమానీలు, విశిష్ట అతిథులు ఉత్సాహంగా పాల్గొన్నారు. షా నాగర్‌దాస్ కుటుంబానికి చెందిన పరేష్ షా భారతదేశం - ఒమన్ మధ్య చారిత్రక సంబంధాలకు వారి సహకారాన్ని నొక్కి చెబుతూ తన కుటుంబ చరిత్రను వివరించారు. ముగింపులో ఒమన్ బుక్ లవర్స్ క్లబ్ వ్యవస్థాపకురాలు అనీషా పర్జిత్ నిర్వహించిన కార్యక్రమం అందరిని ఆకట్టుకున్నది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com