అయోధ్య కి బయల్దేరిన మొదటి రైలు..!
- February 06, 2024
హైదరాబాద్: అయోధ్యకి మొదటి రైలు బయలుదేరింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జనవరి 22న అయోధ్యలోని బాలరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. అప్పటినుండి కూడా అయోధ్యకి వెళ్ళాలని ప్రతి ఒక్కరూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
500 ఏళ్ల నాటి కల సాకారం కావడంతో ఈ కార్యక్రమాన్ని రామ భూమి ట్రస్ట్ ఎంతో మంది ప్రముఖులని ఇన్వైట్ చేసింది. ప్రారంభోత్సవం నేపథ్యంలో కొంత కాలం పాటు నిర్మాణ పనులు నిలిపివేశారు. ప్రస్తుతం అయోధ్యలో మిగతా ఆలయ నిర్మాణ పనులు పునః ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా బాలరాముడు దర్శనం కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి అయోధ్యకి ప్రయాణికులతో మొదటి రైలు బయలుదేరింది. 1400 మంది ప్రయాణికులతో ఈ ట్రైన్ స్టార్ట్ అవ్వడం విశేషం. అయోధ్యకి చేరుకునే రైలు కోసం రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లని చేసింది. అయోధ్య దర్శనం అయ్యాక తిరిగి ట్రైన్ తొమ్మిదన సికింద్రాబాద్ కి రాబోతోంది.
తాజా వార్తలు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- యాంటీడ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ‘రీఅష్యూర్డ్ హోమ్స్’ తో కుటుంబాలకు ఉపశమనం..!!
- సమ్మర్ వర్కింగ్ అవర్స్ వయోలేషన్ రిపోర్టుకు ప్రత్యేక ఛానెల్స్..!!
- GMR ఏరోస్పేస్ పార్క్లో ఎఫ్టీజీ తొలి భారత తయారీ కేంద్రం ప్రారంభం







