మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి కోసం వాళ్లను దూరంగా వుంచితే మంచిదేమో.!
- February 06, 2024
మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖుల నుంచి శుభాకంక్షలు వెల్లువెత్తుతున్న సంగతి కూడా తెలిసిందే.
తాజాగా తెలంగాణా ప్రభుత్వం పద్మ విభూషణ్ చిరంజీవిని ప్రత్యేకంగా సత్కరించి గౌరవించారు. అలాగే, సినీ ప్రముఖులంతా కూడా పద్మ విభూషణ్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపేలా ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట.
ఆ ఈవెంట్కి సినీ ప్రముఖులంతా హాజరు అవుతారని అంటున్నారు. అంతా బాగానే వుంది. కానీ, చిరంజీవిని చూసి కొందరు ఈర్ష్యగా ఫీలవుతుంటారు. చాలా సందర్భాల్లో తమ ఈర్ష్య ద్వేషాల్ని సో కాల్డ్ సినీ ప్రముఖులు బయట పెట్టుకున్నారు కూడా.
గతంలో చిరంజీవికి పద్మ భూషణ్ దక్కిన సమయంలో జరిగిన ఈవెంట్లో ఒకింత డిస్ర్టబెన్స్ క్రియేట్ చేసి, ఆ ఈవెంట్ని పొల్యూట్ చేయడం కూడా చాలా మందికి గుర్తుండే వుంటుంది. కానీ, ఈ సారి అలా జరక్కుండా వుండాలంటే.. సో కాల్డ్ సినీ పెద్దల్ని ఈవెంట్కి దూరంగా వుంచితే మంచిదని మెగా అభిమానులు భావిస్తున్నారు.
కానీ, అది సాధ్యమేనా.? చూడాలి మరి.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్









