మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి కోసం వాళ్లను దూరంగా వుంచితే మంచిదేమో.!

- February 06, 2024 , by Maagulf
మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి కోసం వాళ్లను దూరంగా వుంచితే మంచిదేమో.!

మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖుల నుంచి శుభాకంక్షలు వెల్లువెత్తుతున్న సంగతి కూడా తెలిసిందే.

తాజాగా తెలంగాణా ప్రభుత్వం పద్మ విభూషణ్ చిరంజీవిని ప్రత్యేకంగా సత్కరించి గౌరవించారు. అలాగే, సినీ ప్రముఖులంతా కూడా పద్మ విభూషణ్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపేలా ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట.

ఆ ఈవెంట్‌కి సినీ ప్రముఖులంతా హాజరు అవుతారని అంటున్నారు. అంతా బాగానే వుంది. కానీ, చిరంజీవిని చూసి కొందరు ఈర్ష్య‌గా ఫీలవుతుంటారు. చాలా సందర్భాల్లో తమ ఈర్ష్య ద్వేషాల్ని సో కాల్డ్ సినీ ప్రముఖులు బయట పెట్టుకున్నారు కూడా.

గతంలో చిరంజీవికి పద్మ భూషణ్ దక్కిన సమయంలో జరిగిన ఈవెంట్‌లో ఒకింత డిస్ర్టబెన్స్ క్రియేట్ చేసి, ఆ ఈవెంట్‌ని పొల్యూట్ చేయడం కూడా చాలా మందికి గుర్తుండే వుంటుంది. కానీ, ఈ సారి అలా జరక్కుండా వుండాలంటే.. సో కాల్డ్ సినీ పెద్దల్ని ఈవెంట్‌కి దూరంగా వుంచితే మంచిదని మెగా అభిమానులు భావిస్తున్నారు.
కానీ, అది సాధ్యమేనా.? చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com