ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు భద్రత పెంపు
- February 08, 2024అమరావతి: తనకు భద్రత కల్పించాలని కోరినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డ సంగతి తెలిసిందే. తనకు చెడు చేయాలనే ఉద్దేశంతోనే భద్రతను కల్పించడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షురాలినైన తాను రాష్ట్రమంతా పర్యటించాల్సి ఉంటుందని… భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా పోలీసులు షర్మిలకు భద్రతను పెంచారు. ఈ విషయాన్ని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. షర్మిల అభ్యర్థన మేరకు ఆమె భద్రతను వన్ ప్లస్ వన్ నుంచి టూ ప్లస్ టూకి పెంచామని చెప్పారు. డీజీపీ ఆదేశాల మేరకు భద్రతను పెంచామని తెలిపారు. ఎవరి ప్రాణాలకైనా ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ విభాగం నివేదిక ఇస్తే… వారికి గన్ మెన్లను కేటాయిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన