ఫిబ్రవరి ఆరంభంలోనే దంచికొడుతున్న ఎండలు
- February 09, 2024
హైదరాబాద్: తెలంగాణ లో ఫిబ్రవరి ఆరంభం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 దాటితే ఇంట్లో నుండి బయటకు వెళ్లేందుకు ప్రజలు వామ్మో అంటున్నారు. ఏప్రిల్ లో ఎలాగైతే ఎండలు ఉంటాయో..ఇప్పుడు ఫిబ్రవరి మొదటి వారం లోనే ఆ విధంగా ఉండడం తో ఏప్రిల్ , మే నెలలో ఇంకెలా ఉండబోతాయో అని ఖంగారుపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం చాల చోట్లా 40 డిగ్రీలకు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది. రాబోయే మరో నాలుగు రోజుల్లో మరింత తీవ్రమైన వేడి పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత 5 నుంచి 6 రోజుల పాటు వాతావరణం చల్లబడుతుందని పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతలతో గ్రేటర్ హైదరాబాద్ నగర వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
ఇక మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితులు ఎలా ఉంటయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజుల్లో చూసుకుంటే గ్రేటర్ పరిధిలో మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. గురువారం జూబ్లిహిల్స్లో ఏకంగా 38.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక సరూర్నగర్, చందానగర్లో 38.3, బేగంపేటలో 37.6, ఉప్పల్లో 37.3 చొప్పున ఉష్ణగ్రతలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









