గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక..
- February 09, 2024
మీరు గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం తీవ్ర హెచ్చరికను జారీ చేసింది. గూగుల్ క్రోమ్లో ఉన్న లోపాల గురించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) హెచ్చరించింది. వెంటనే స్పందించి గూగుల్ క్రోమ్ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. లేకపోతే మీ సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని తెలిపింది. తాజాగా సెర్ట్ ఈ హెచ్చరికను జారీ చేసింది.
గూగుల్ క్రోమ్ ని ఉపయోగిస్తున్న వాళ్ళందరూ లేటెస్ట్ వెర్షన్ని తక్షణమే అప్డేట్ చేసుకోవాలని సెర్ట్ సూచించింది. 114.0.5735.350 లేదా ఆ తర్వాతి వెర్షన్లకు అప్డేట్ కావాలని తెలిపింది. అంతకు ముందు ఉండే వెర్షన్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందట. ఆ వెర్షన్స్లో ఎక్స్టెన్షన్లకు డేట్ ఇన్పుట్ లేదని, బ్రౌజ్ చేసేటప్పుడు సమాచారం లీక్ అవుతోందని తెలిపింది. ఇంటర్నెట్ను బ్రౌజ్ చేస్తున్నప్పుడు, ముఖ్యంగా తెలియని, అనుమానాస్పద వెబ్సైట్లను ఓపెన్ చేసినపుడు వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. తెలియని ఐడీల నుంచి వచ్చిన ఈ-మెయిల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







