గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక..
- February 09, 2024
మీరు గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం తీవ్ర హెచ్చరికను జారీ చేసింది. గూగుల్ క్రోమ్లో ఉన్న లోపాల గురించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) హెచ్చరించింది. వెంటనే స్పందించి గూగుల్ క్రోమ్ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. లేకపోతే మీ సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని తెలిపింది. తాజాగా సెర్ట్ ఈ హెచ్చరికను జారీ చేసింది.
గూగుల్ క్రోమ్ ని ఉపయోగిస్తున్న వాళ్ళందరూ లేటెస్ట్ వెర్షన్ని తక్షణమే అప్డేట్ చేసుకోవాలని సెర్ట్ సూచించింది. 114.0.5735.350 లేదా ఆ తర్వాతి వెర్షన్లకు అప్డేట్ కావాలని తెలిపింది. అంతకు ముందు ఉండే వెర్షన్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందట. ఆ వెర్షన్స్లో ఎక్స్టెన్షన్లకు డేట్ ఇన్పుట్ లేదని, బ్రౌజ్ చేసేటప్పుడు సమాచారం లీక్ అవుతోందని తెలిపింది. ఇంటర్నెట్ను బ్రౌజ్ చేస్తున్నప్పుడు, ముఖ్యంగా తెలియని, అనుమానాస్పద వెబ్సైట్లను ఓపెన్ చేసినపుడు వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. తెలియని ఐడీల నుంచి వచ్చిన ఈ-మెయిల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
తాజా వార్తలు
- షార్జా, అబుదాబికి ఫ్లైట్ సర్వీసులు..ఎయిర్ ఇండియా
- ఈద్ అల్ ఫితర్.. దుబాయ్ లో 3 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- నివాస ఉల్లంఘనదారులకు ఆశ్రయం కల్పిస్తే SR100,000 జరిమానా, జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో 240,000 మందికి పైగా విద్యార్థులకు ఆన్లైన్ చదువులు..!!
- స్ప్రింగ్ బ్రేక్ తర్వాత మరో రెండు వారాలు ఆన్లైన్ క్లాసులు..
- వాటర్ ట్యాంకర్ల ధరలు పెంపు..నోటీసులు జారీ..!!
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!









